ఎందుకు కామ్ అయ్యారు..!

మహర్షి సినిమా హడావిడి ముగిసింది. సక్సెస్ ఫుల్ గా ఒక వారం పూర్తి చేసుకుంది. ఇక మెల్లిగా తమ సినిమాలను బాక్సాఫీసు దగ్గర దింపడానికి దర్శక నిర్మాతలు [more]

Update: 2019-05-17 08:30 GMT

మహర్షి సినిమా హడావిడి ముగిసింది. సక్సెస్ ఫుల్ గా ఒక వారం పూర్తి చేసుకుంది. ఇక మెల్లిగా తమ సినిమాలను బాక్సాఫీసు దగ్గర దింపడానికి దర్శక నిర్మాతలు రెడీ అయ్యారు. ఈ రోజు అల్లు శిరీష్ ఏబీసీడీ సినిమా విడుదలైంది. మంచి ప్రమోషన్స్ తో అల్లు శిరీష్ ప్రేక్షకులకు సినిమా మీద ఆసక్తి పెంచాడు. మరి సినిమా సంగతి మరి కొద్దిసేపట్లో తేలుతుంది. ఇక వచ్చే శుక్రవారం విడుదల కాబోతున్న బెల్లంకొండ – తేజ కాంబోలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ పోషించిన సీత సినిమా మీద మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ తో సినిమా మీద క్రేజ్ పెంచుతుంది యూనిట్. ఇక సెన్సార్ నుండి క్లీన్ యూ సర్టిఫికెట్ తో బరిలోకి దిగుతున్న సీత సినిమాతో తేజ హిట్ కొట్టడం ఖాయమంటున్నారు.

ప్రమోషన్స్ చేయడం లేదే..!

మరి ఆ తర్వాత మే 31న తమ సినిమా విడుదల అంటూ గత నెలలోనే ఆడియో వేడుకని నిర్వహించిన సూర్య – సెల్వ రాఘవ్ ల ఎన్.జి.కె హడావిడి మాత్రం ఇంకా మొదలవ్వలేదు. సినిమా మీద క్రేజ్ పెంచాలి అంటే సినిమా ప్రమోషన్స్ ముఖ్యం. విడుదలకు కేవలం 15 రోజుల టైం మాత్రమే ఉంది. కానీ సూర్య చడీచప్పుడు చెయ్యడం లేదు. ఇక హీరోయిన్స్ సాయి పల్లవి, రకుల్ ప్రీత్ తమ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరి ఎన్.జి.కె డైరెక్టర్ సెల్వ రాఘవన్ తో సూర్యకి విభేదాల కారణంగానే ఎన్.జి.కె ప్రమోషన్స్ జరగడం లేదా అంటే నిజమే అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఎప్పుడో బయటికొచ్చిన ఈ న్యూస్ పై అటు సూర్య, ఇటు సెల్వా ఎక్కడా స్పందించలేదు. వారి మధ్యన విభేదాల కారణంగా నిర్మాతలను బలి చేస్తున్నారా? ఎంతగా మార్కెట్ లో సినిమా మీద క్రేజ్ ఉన్నా ప్రేక్షకుల్లోకి సినిమా వెళ్లాలంటే ప్రమోషన్స్ ఎంత అవసరమో మనం చూస్తూనే ఉన్నాం.

Tags:    

Similar News