సుకుమార్ విల్లా కబుర్లు!

రంగస్థలంసినిమా తర్వాత సుకుమార్ రేజ్ అమాంతం పెరగడమే కాదు.. 15 కోట్ల పారితోషికం తీసుకున్నాడనే టాక్ కూడా ఉంది. ఇక అల్లు అర్జున్ తెరకెక్కిస్తున్న పుష్ప పాన్ [more]

Update: 2020-11-29 05:04 GMT

రంగస్థలంసినిమా తర్వాత సుకుమార్ రేజ్ అమాంతం పెరగడమే కాదు.. 15 కోట్ల పారితోషికం తీసుకున్నాడనే టాక్ కూడా ఉంది. ఇక అల్లు అర్జున్ తెరకెక్కిస్తున్న పుష్ప పాన్ ఇండియా సినిమాకి సుకుమార్ భారీ పారితోషికం తీసుకుంటున్నాడని అంటుంటుండగా.. ఇప్పడు సుకుమార్ హైదెరాబాదులో కొన్న ఓ విల్లా ముచ్చట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సుకుమార్ హైదరాబాద్ కొండాపూర్ ప్రాంతంలో 12 కోట్లు విలువ చేసే ఖరీదైన విల్లా కొనుక్కుని పుష్ప షూటింగ్ కి బ్రేకిచ్చి మరీ గృహప్రవేశం చేసినట్లుగా తెలుస్తుంది.

గతంలో సుకుమార్ కి ఖరీదైన ప్లాట్ ఉన్నప్పటికీ.. రీసెంట్ గా 12 కోట్లు విలువ చేసే విల్లా కొనుగోలు చేసాడని.. కొండాపూర్ మహేష్ ఏఎంబీ థియేటర్ కి కొండాపూర్ చిర్రాక్ పబ్లిక్ స్కూల్ కి దగ్గరలోనే సుకుమార్ విల్లా ఉందని చెబుతున్నారు. కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సుకుమార్ విల్లా గృహ ప్రవేశం నిరాడంబరంగా జరిగింది అని, ఆ ఫంక్షన్ కి అల్లు అర్జున్ కూడా హాజరయ్యాడనే టాక్ నడుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న సుకుమార్ తన తదుపరి సినిమాని రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో చెయ్యబోతున్నాడు. మరి పుష్ప సినిమాతో సుకుమార్ రేంజ్ మాములుగా పెరగలేదు

Tags:    

Similar News