సుకుమార్ పర్యవేక్షణలో శౌర్య -రష్మిక..?

Update: 2018-10-09 07:18 GMT

టాప్ డైరెక్టర్ సుకుమార్ రంగస్థలం సినిమాతో నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో డైరెక్టర్ గా బిజీ గా ఉన్న సుకుమార్ వీలున్నప్పుడు తన దగ్గర పనిచేసే శిష్యుల దర్శకత్వలో సినిమాలు కూడా నిర్మిస్తుంటాడు. గతంలో కుమారి 21 ఎఫ్, దర్శకుడు లాంటివి సుకుమార్ రైటింగ్ స్కిల్స్ తో ఆయన నిర్మాతగా తెరకెక్కిన సినిమాలే. తాజాగా సుకుమార్ మహేష్ బాబు కోసం కథను డెవెలెప్ చెయ్యడంతో పాటు సుకుమార్ దగ్గర పనిచేసిన ఒక శిష్యుడితో ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా కోసం హీరో హీరోయిన్స్ ఎంపిక జరుగుతుందట. అయితే సుకుమార్ శిష్యుడు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ సినిమాలో నర్తనశాలతో దెబ్బతిన్న నాగ శౌర్య హీరోగా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఛలోతో సెన్సేషనల్ హిట్ అందుకున్న నాగ శౌర్య నర్తనశాలతో ఫ్లాప్ అందుకున్నాడు.

హీరోహీరోయిన్లు ఫిక్స్...

ఇక ఛలో సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్ లో గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న మరోసారి శౌర్య సరసన నటించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే నాగ శౌర్య - రష్మికలు కలిసి ఛలో సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. హీరోహీరోయిన్ల గా రష్మిక, శౌర్య పేర్లు ఖరారయ్యాయని... మిగతా నటీనటుల ఎంపిక కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ సినిమాపై ఒక అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి సుకుమార్ కేవలం నిర్మాతగానే కాకుండా కథ, మాటలు లాంటివి కూడా అందిస్తాడేమో అనేది మాత్రం క్లారిటీ లేదు.

Similar News