ఆ డైరెక్టర్ చూపు...బాలీవుడ్ వైపు...

Update: 2018-07-10 08:32 GMT

రంగస్థలం సినిమాతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుని మంచి ఊపు మీదున్న సుకుమార్ చూసు బాలీవుడ్ పై పడింది. ఆయన త్వరలో బాలీవుడ్ హీరో వరున్ ధావన్ తో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఇద్దరి మధ్య ఒక దఫా చర్చలు జరిగాయని తెలుస్తోంది. దక్షిణాదిలో వచ్చిన ఓ సినిమానే వరుణ్ ధావన్ తో హిందీలో రీమేక్ చేయనున్నారు. అయితే, ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం సుకుమార్ మహేశ్ బాబుతో ఓ క్రైం థ్రిల్లర్ తీస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ సీబీఐ అధికారిగా నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

Similar News