నిర్మాతగానూ బిజీగా మారుతున్న సుకుమార్

రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం మహేష్ 26వ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఒక పక్క డైరెక్షన్ బాధ్యతలు చూసుకుంటూ మరో [more]

Update: 2019-02-16 06:55 GMT

రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం మహేష్ 26వ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఒక పక్క డైరెక్షన్ బాధ్యతలు చూసుకుంటూ మరో పక్క సహ నిర్మాతగా మారి వరుస సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగానే సుకుమార్ రీసెంట్ గా మైత్రి మూవీస్ తో కలిసి సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరో గా పరిచయం చేస్తూ ఓ సినిమాని నిర్మిస్తున్నాడు. దీనికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. రీసెంట్ గానే ఈ చిత్రం లాంచ్ అయ్యింది.

మెగా డాటర్ తో…

ఈ సినిమాతో పాటు మరో సినిమాని కూడా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు సుకుమార్. అయితే ఈసారి మెగా డాటర్ నిహారిక కోసం కథను సిద్ధం చేశాడట సుకుమార్. అయితే ఈ మూవీని గీతా ఆర్ట్స్ తో కానీ లేదా అంజనా ప్రొడక్షన్స్ తో కలిసి నిర్మించేలా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి వివరాలు తెలియనున్నాయి.

Tags:    

Similar News