సుజిత్ లూసిఫెర్ వదిలేసి… గోపీచంద్ కోసం..!!

చిరంజీవి మలయాళం రీమేక్ లూసిఫెర్ రీమేక్ కోసం ప్లాప్ డైరెక్టర్ సాహో ఫేమ్ సుజిత్ ని తీసుకొచ్చి మెగా ఫాన్స్ కి షాకిచ్చాడు. మెగా ఫాన్స్ సుజిత్ [more]

Update: 2020-07-28 11:11 GMT

చిరంజీవి మలయాళం రీమేక్ లూసిఫెర్ రీమేక్ కోసం ప్లాప్ డైరెక్టర్ సాహో ఫేమ్ సుజిత్ ని తీసుకొచ్చి మెగా ఫాన్స్ కి షాకిచ్చాడు. మెగా ఫాన్స్ సుజిత్ దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ ఏంటన్నయ్యా అంటూ కలవరపడ్డారు. అయితే చిరు లాక్ డౌన్ లో సుజిత్ కి ఇచ్చిన సలహాలు సూచనలతో లూసిఫెర్ రీమేక్ వెర్షన్ స్క్రిప్ట్ ని సుజిత్ ఫైనల్ చేసాడని.. చిరు కూడా మెచ్చాడనే అన్నారు. కానీ తర్వాత సుజిత్ నుండి లూసిఫెర్ రీమేక్ చేతులు మారుతున్నట్టుగా ఓ న్యూస్. అలాగే లూసిఫెర్ రీమేక్ ని చిరంజీవి ఆపేసాడని అన్నారు. సుజిత్ చెప్పిన తెలుగు వర్షన్ స్క్రిప్ట్ చిరు ని తృప్తి పరచని కారణంగా లూసిఫెర్ రీమేక్ ఆపేసినట్లుగా వార్తలొచ్చాయి.

అయితే ఈ విషయంలో సుజిత్ కూడా లైట్ తీసుకుని ఇప్పుడు సుజిత్ గోపీచంద్ తో యువి క్రియేషన్స్ నిర్మించే సినిమా కి షిఫ్ట్ అయ్యాడనే టాక్ మొదలయ్యింది. చిరంజీవి లాంటి పెద్ద స్టార్ తో మనకెందుకులే అనుకున్న సుజిత్ సైలెంట్ గా గోపీచంద్ సినిమా కోసం వర్క్ లో పడ్డాడని అంటుంటే.. లూసిఫెర్ కోసం మరో డైరెక్టర్ వేటలో మెగా హీరోలున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినబడుతుంది. మరి సుజిత్ కి ఆశపెట్టి పని చేయించుకున్నాక అతని హ్యాండ్ ఇవ్వడం పాపం అనిపించినా.. స్క్రిప్ట్ పక్కాగా లేకపోతె హీరోలుమాత్రం ఏం చేస్తారు ఇలానే చేస్తారు. అందులో బలయ్యేది ఇలాంటి దర్శకులే.

Tags:    

Similar News