శర్వానంద్ తో 1994 లోకి సుధీర్

Update: 2018-05-30 07:39 GMT

సుధీర్ వర్మ - శర్వానంద్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ఒక గ్యాంగ్ స్టార్ బయోపిక్ కి సంబంధించింది అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా సగం వరకు 1994 బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందట. ఈ మధ్యే 'రంగస్థలం', 'మహానటి' లాంటి సినిమాలు పీరియాడిక్ లుక్ ను చూపించాయి.

రెండు సెట్లు..భారీ ఖర్చుతో..

మళ్లీ ఇప్పుడు ఈ సినిమా పీరియాడిక్ లుక్ లో కనిపించనుంది. ఇప్పుడు కనపడే ఫ్లాట్ టీవీలు, మోడల్ బైక్ లు, కార్లు ఈ సినిమాలో కనిపించవు. సో ఆ ఫీల్ ని క్రియేట్ చేయటం కోసం వైజాగ్ మరియు హైదరాబాద్ లో సెట్ లు డిజైన్ చేసి అందులో షూట్ చేస్తున్నారంట. ఈ సెట్స్ కోసం భారీగానే ఖర్చు పెడుతున్నట్టు అర్ధం అవుతుంది. సుధీర్ వర్మ సినిమాలు అంటే ఎమోషన్స్ అంతగా ఉండవు. యాక్షన్ తో కూడిన ఎంటర్టైన్మెంట్ తో సాగే కథలు ఆయనవి. అయితే ఈ సినిమా అందుకు పూర్తిగా భిన్నంగా, ఇటు యాక్షన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్ సీన్లు కూడా బలంగా వుంటాయని తెలుస్తోంది.

Similar News