సుధీర్ బాబు తెలివైనోడే..!

Update: 2018-09-28 06:28 GMT

గత వారం రిలీజ్ అయిన 'నన్ను దోచుకుందువటే' సినిమాకు మంచి పాజిటివ్ టాకే ఉంది. సుధీర్ బాబు - నభా నటేష్ కాంబినేషన్ లో విడుదలైన ఈ సినిమా అన్ని సెంటర్స్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. వసూళ్ల వరకు పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నభా నటేష్ కు మంచి పేరు వచ్చింది. పేరు రావడమే కాదు ఆఫర్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి.

మంచి అవకాశాలు...

హీరో రవితేజ విఐ ఆనంద్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ సెలెక్ట్ అయింది. ఇక ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన ఆర్ ఎస్ నాయుడు కి కూడా మంచి పేరు వచ్చింది. తాజాగా ఈ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట. ఆల్రెడీ కొంతమంది ఆయనతో చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది.

వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసిన సుధీర్ బాబు...

అయితే తన రెండో మూవీ కూడా సుధీర్ బాబుతోనే చేయనున్నాడు నాయుడు. 'నన్ను దోచుకుందువటే' హిట్ అయిన వెంటనే తనతో మంచి సబ్జెక్ట్ రెడీ చేయమని అడ్వాన్స్ కూడా ఇచ్చాడట నటుడు కమ్ ప్రొడ్యూసర్ సుధీర్ బాబు. సో తనకు మొదటి సినిమాతో లైఫ్ ఇచ్చిన సుధీర్ బాబుతోనే తన రెండు సినిమా అతనితోనే ఉంటుందని అర్ధం అవుతుంది. సుధీర్ బాబు సొంత బ్యానర్ లోనే ఈసినిమా కూడా ఉండబోతున్నట్టు సమాచారం.

Similar News