గోపీచంద్ కోసం బాలీవుడ్ ఆఫర్ నే కాలదన్నారా.?

Update: 2018-09-29 06:41 GMT

మహేష్ బాబు బావగా.. సూపర్ స్టార్ కృష్ణకి అల్లుడిగా సుధీర్ బాబు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నాడు. హీరోగా మెల్లిగా సినిమాలు చేస్తూ అవకాశం ఉన్నపుడు బాలీవుడ్(భాగీ)కి కూడా వెళ్లొస్తున్నాడు. ఈ ఏడాది సమ్మోహనం తో సాలిడ్ హిట్ అందుకున్న సుధీర్ బాబు తాజాగా నన్ను దోచుకుందువటే సినిమాతో యావరేజ్ అందుకున్నాడు. అలాగే హీరో గా ఉంటూనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా నడుపుతున్నాడు. ఇక నన్ను దోచుకుందువటే సినిమా తర్వాత సుధీర్ బాబు పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటిస్తున్నాడు.

తన స్నేహితుడే కావడంతో...

సుధీర్ బాబు కి ఆల్రెడీ బ్యాట్మెంటన్ లో ప్రవేశం ఉంది. సినిమాల్లోకి, బిజినెస్ చేయకముందు సుధీర్ బాబుకి బ్యాట్మెంటన్ అంటే చాలా ఇష్టమట. అప్పట్లో గోపీచంద్ తనకి ఫ్రెండ్ కూడా అని చెప్పాడు.. సుధీర్ బాబు ఒక ఇంటర్వ్యూలో. గోపీచంద్ తాను బ్యాట్మెంటన్ ఆడుతున్నప్పుడు తాను బిజినెస్, సినిమాల్లోకొస్తే... గోపీచంద్ మాత్రం బ్యాట్మెంటన్ ప్లేయర్ గా తర్వాత కోచ్ గా మారాడని చెప్పాడు. అయితే ఎప్పుడో ఆడిన ఆటను ఇప్పుడు ఈ బయోపిక్ సినిమా కోసం మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా చెప్పాడు. అయితే ఈ బయోపిక్ కోసం సుధీర్ బాబు బాలీవుడ్ లో వచ్చిన ఒక క్రేజీ అవకాశాన్ని చేజార్చుకున్నాడని టాక్.

బాలీవుడ్ అవకాశం వచ్చినా...

బాలీవుడ్ లో కరణ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమాలో సుధీర్ బాబుకి ఒక రోల్ ఆఫర్ వచ్చిందట. కానీ సుధీర్ బాబు పుల్లెల గోపీచంద్ బయోపిక్ తో డేట్స్ లేకపోవడంతో.. బ్రహ్మాస్త్ర ఆఫర్ ని వదిలేసాడట. సుధీర్ బాబు ఆల్రెడీ బాలీవుడ్ లో భాగీ సినిమాలో కండలు తిరిగిన విలన్ గా అదరగొట్టాడు. అందులో ఆ విలన్ రోల్ నచ్చే బ్రహ్మాస్త్రలో ఒక రోల్ ఆఫర్ చేశారట. మరి బాలీవడ్ లో తెరకెక్కుతున్న ఆ బ్రహ్మాస్త్రలో కింగ్ నాగార్జున, రణబీర్ కపూర్, అమితాబచ్చన్, అలియా భట్ వంటి హేమ హేమీలు నటిస్తున్నారు.

Similar News