అయ్యప్పన్ గా పవన్.. కోషియం గా సుదీప్?

పవన్ కళ్యాణ్ మలయాళం రీమేక్ అయ్యప్పన్ కోషియం సినిమా చేస్తున్నాడు అన్నప్పటినుండి.. మలయాళంలో తెరకెక్కిన అయ్యప్పన్ కోషియం సినిమాని తెలుగు ప్రేక్షకులు విరగబడి అమెజాన్ ప్రైమ్ లో [more]

Update: 2020-10-31 04:33 GMT

పవన్ కళ్యాణ్ మలయాళం రీమేక్ అయ్యప్పన్ కోషియం సినిమా చేస్తున్నాడు అన్నప్పటినుండి.. మలయాళంలో తెరకెక్కిన అయ్యప్పన్ కోషియం సినిమాని తెలుగు ప్రేక్షకులు విరగబడి అమెజాన్ ప్రైమ్ లో తిలకించేశారు. ఎలాగూ థియేటర్స్ లేవు.. ఖాళీగా ఉన్న ప్రేక్షకులు ఏ హీరో అయినా రీమేక్ చేస్తున్నారు అనగానే… ఆ రీమేక్ లో ఏముందో అంటూ ఆ సినిమాని చూసే వరకు నిద్ర పోవడం లేదు. మరి అందుకే పవన్ అయ్యప్పన్ కోషియం సినిమాపై అందరిలో ఆసక్తి. ఆ సినిమాలో బిజూ మీనన్ పాత్రలో పవన్ నటిస్తుంటే.. మరో హీరో పృద్విరాజ్ పాత్రలో ఏ హీరో నటిస్తాడనే క్యూరియాసిటీ అందరిలో ఉంది.

అయితే ఫస్ట్ నుండి రానా పవన్ కలిసి ఈ సినిమా చేస్తున్నారంటే.. మధ్యలో పవన్ కి వీరాభిమాని నితిన్ మరో హీరో పృద్విరాజ్ పాత్ర చేస్తున్నాడంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా అయ్యప్పన్ గా పవన్ కళ్యాణ్ నటిస్తుంటే.. కోషియం కేరెక్టర్ లో కన్నడ హీరో కిచ్చ సుదీప్ నటిస్తున్నాడంటూ మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొన్నామధ్యన కిచ్చ సుదీప్ మర్యాదపూర్వకంగా పవన్ ని కలవడం.. ఇప్పుడు అయ్యప్పన్ కోషియం లో తెలుగు హీరో కన్నా కిచ్చ సుదీప్ అయితే బావుటుంది అని పవన్ దర్శకుడు శేఖర్ కి చంద్ర కి చెప్పడంతో సుదీప్ ని కలిసి ఆ హీరో పాత్రకి ఒప్పించనున్నారనే టాక్ మొదలైంది.

Tags:    

Similar News