మహేష్ విలన్ అతనా?

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమాని మొదలు పెట్టాడు. ఆ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని [more]

Update: 2020-06-12 11:41 GMT

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమాని మొదలు పెట్టాడు. ఆ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని మహేష్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా అంత సద్దుమణిగాక, లాక్ డౌన్ ముగిసాక సర్కారు వారి పాట సెట్స్ మీదకెళ్లాల్సి ఉంది. అయితే ఈలోపు పరశురామ్లో సినిమా లోని నటుల ఎంపిక చేపట్టినట్లుగా తెలుస్తుంది. మహేష్ కి హీరోయిన్ గా కియారా వెంటపడుతుంటే.. కియారా నో చెప్పలేక నో చెప్పడంతో మరో బాలీవుడ్ భామని తీసుకుంటున్నారని అంటున్నారు.

తాజాగా మహేష్ కోసం సర్కారు వారి పాట లో ఓ క్రేజీ విలన్ పేరు బయటికి వచ్చింది. ఈగ సినిమాలో నాని ని చంపి సమంతని దక్కించుకోవడానికి ఎత్తులు వేసే ఈగ సుదీప్ ని సర్కారు వారి పాటలో మెయిన్ విలన్ గా పరశురామ్ ఎంపిక చేసుకుని సుదీప్ ని సంప్రదించాడని.. సుదీప్ కి కథ అందులోని తన రోల్ నచ్చడంతో.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. బాహుబలి, ఈగ, సై ర సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుదీప్ ఇప్పుడు మహేష్ కోసం ఎలాంటి విలనిజం చూపిస్తాడో అంటున్నారు. ఇక పరశురామ్ మహేష్ ని ఈ సినిమాలో సరికొత్తగా చూపించబోతున్నాడు. ఇప్పటికే మహేష్ బ్యాక్ నెక్ లుక్ అందరిని ఆకట్టుకుంది.

Tags:    

Similar News