మ‌హేష్ సినిమాలో మ‌రో స్టార్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా [more]

Update: 2019-04-20 13:08 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమా తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా ఆఫిషియ‌ల్ గా అనౌన్స్ కాకపోయినా ఈ సినిమా పనుల్లో బిజీ అయిపోయి తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. దిల్ రాజు – అనిల్ సుంకర కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అనిల్ ఒక పక్క ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తూనే మరోపక్క ఒక్కొక్క నటుడిని ఫైనల్ చేస్తున్నాడట. ఇప్పటికే కొన్ని పాత్రలు కోసం అనిల్… విజయ శాంతి, జగపతి బాబు, బండ్ల గణేష్ ని అప్రోచ్ అయ్యారట.

కీల‌క పాత్ర‌లో విజ‌య‌శాంతి

రీసెంట్ గా ఒక కీలక పాత్ర కోసం కన్నడ నటుడు ఉపేంద్రని కూడా తీసుకుందాం అనుకున్నారు. కానీ ఆయన డేట్స్ కుదరక వద్దు అనుకున్నారు. ఆయన ప్లేస్ లో వేరే సీనియర్ హీరోని తీసుకుందాం అని అనుకుంటున్నారు. ఇక ఇందులో విజయశాంతి సమాజం బాగు కోసం పరితపించే పాత్రలో కనిపించనున్నారు. అలానే జగపతిబాబు ఒక ఓ పాత్రలో మెరవనున్నారు. మహర్షి రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.

Tags:    

Similar News