మహర్షి ప్రీరిలీజ్ కు ఇద్దరు స్టార్ హీరోలు..!

మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ వరల్డ్ వైడ్ గా మే 9న రిలీజ్ అవుతున్న సంగతి తెల్సిందే. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ [more]

Update: 2019-04-25 07:38 GMT

మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ వరల్డ్ వైడ్ గా మే 9న రిలీజ్ అవుతున్న సంగతి తెల్సిందే. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించాలని మహేష్ టీం చేస్తుంది. అందుకే ఈ ఈవెంట్ కి తనతో గతంలో పని చేసిన 24 సినిమాల డైరెక్టర్స్ ని ఇన్వైట్ చేయాలని చూస్తున్నాడు మహేష్. ఈ ఈవెంట్ మే 1న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో జరగనుంది. అలానే మహేష్ మరో ఇద్దరూ స్టార్ హీరోస్ ని ఇన్వైట్ చేయనున్నాడు.

ఇద్దరూ కలిసి వస్తే..!

మహేష్ ఆహ్వానించేది ఎన్టీఆర్, రామ్ చరణ్ లను అంటున్నారు. వీరిద్దరిలో ఒకరు లేదా ఇద్దరూ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ మహేష్ కి మంచి స్నేహితులు కావడం వల్ల, ఇద్దరూ వచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆల్రెడీ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ వస్తే అభిమానులకి అంతకుమించిన పెద్ద పండుగ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

Tags:    

Similar News