పడి పడి లేచె మనసు ఫంక్షన్ కు స్టార్ హీరో

Update: 2018-12-15 14:09 GMT

శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ప‌డిప‌డి లేచె మ‌న‌సు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది. డిసెంబ‌ర్ 17న ప‌డిప‌డి లేచె మ‌న‌సు ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌ యూనిట్. శిల్ప‌క‌ళా వేదిక‌లో జ‌ర‌గ‌బోయే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నారు. కలకత్తా నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తోన్న ప్రేమ‌క‌థ ప‌డిప‌డి లేచె మ‌న‌సు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ముర‌ళి శ‌ర్మ‌, సునీల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ సంస్థ‌లో సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Similar News