శ్రీ రెడ్డి దెబ్బ: రామానాయుడు స్టూడియో దగ్గర హై అలెర్ట్..!

Update: 2018-05-02 07:16 GMT

శ్రీ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవుతోందా? అలాగేవుంది వ్యవహారం చూస్తుంటే.. వివరాల్లోకెళితే, శ్రీ రెడ్డి మరి కొందరు మహిళా సంఘాల వుద్యమకారులతో కలసి రామానాయుడు స్టూడియో దగ్గర మెరుపు ధర్నా చేయనున్నారని నిఘావర్గాల భోగట్టా. అనూహ్య సంఘటనలు పునరావ్రుతం కాకుండా చూడడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో పోలీసులను మొహరించినట్టు తెలుస్తోంది. రాంగొపాల్ వర్మ ప్రొద్భలంతో పవన్ కల్యాణ్ ను నిందించిన తర్వాత, టి.వి. చానళ్ళపై పవన్ యుద్ధం ప్రకటించడం, తద్వారా చానళ్ళన్నీ శ్రీ రెడ్డి ని ప్రోత్సహించడాన్ని మానుకోవడంతో శ్రీ రెడ్డి గత కొన్ని వారాలుగా కేవలం ఫేస్ బుక్ కే పరిమితమయింది. మరి ఈరోజు ఏమవుతుందో చూడాలి.

Similar News