పాపం...శ్రీనివాస్ రెడ్డి

Update: 2018-06-06 09:37 GMT

మెగా స్టార్ చిరంజీవి ఫామిలీ నుండి ఇప్పటికే పది మంది పైనే హీరోలు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి సినిమాల ప్రొమోషన్స్ కి చిరు వచ్చి సపోర్ట్ చేస్తుంటాడు. రామ్ చరణ్ నుండి అల్లుడు కళ్యాణ్ వరకు అందరికి సినిమాల ప్రొమోషన్స్ కి చిరంజీవి మోహవాటం లేకుండా అటెండ్ అవుతుంటాడు.

ముఖ్య అతిథి కరువు...

అలాగే ఈ శనివారం జరిగే 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవినే ముఖ్య అతిథి అటెండ్ అవ్వనున్నారు. కానీ పాపం శ్రీనివాస్ రెడ్డి నటించిన 'జంబలకడిపంబ' సినిమా ట్రైలర్ లాంచ్ అదే రోజు రిలీజ్ ఉంది. దీంతో ఆ ట్రైలర్ లాంచ్ చేయడానికి ముఖ్య అతిధి కరువు అయ్యారు. త్రివిక్రమ్ తో శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. త్రివిక్రమ్ ని పిలుద్దాం అంటే..హిట్ కొట్టి కానీ పబ్లిక్ ఫంక్షన్ లకు రాను అంటున్నారు ఆయన. సరే అని కళ్యాణ్ రామ్ తో ఎక్కువ సినిమాలు చేసిన అనుభవం ఉండటంతో కళ్యాణ్ రామ్ ని పిలుద్దాం అంటే ఆయన సినిమా కూడా 14న విడుదలవుతోంది. సో ఆయన కూడా వచ్చే ఛాన్స్ లేదు. దాంతో 'జంబలకిడిపంబ' ఫంక్షన్ కు సరైన చీఫ్ గెస్ట్ దొరకడం లేదు.

సుధీర్ కి ఇవే తిప్పలు...

అలానే సుధీర్ బాబు 'సమ్మోహనం' సినిమా ఈ నెల 15న విడుదల కాబోతుంది. ఈ మూవీకి ప్రీ రిలీజ్ ప్రొమోషన్స్ చేద్దాం అంటే మహేష్ విదేశాల్లో ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు. ఒకేవేళ వచ్చిన ఫంక్షన్ కు వచ్చే మూడ్ వుంటుందో? వుండదో? అనుమానం. కృష్ణతో చేద్దాం అనుకుంటే ఆల్రెడీ టీజర్ లాంచ్ చేయించేసారు. అందువల్ల 'సమ్మోహనం' ఫంక్షన్ కు కూడా చీఫ్ గెస్ట్ ను వెదుక్కోవాల్సి వుంది.

Similar News