అడిగారు కానీ.. నేను రావాలిగా అంటుంది!!

శ్రియ నిన్న RRR మూవీ గురించి మట్లాడి సినిమాపై అంచనాలు పెంచేస్తే.. తాజాగా శ్రియ నితిన్ అంధధూన్ రీమేక్ విషయంపై పెదవి విప్పింది. నితిన్ బాలీవుడ్ అంధధూన్ [more]

Update: 2020-09-14 04:30 GMT

శ్రియ నిన్న RRR మూవీ గురించి మట్లాడి సినిమాపై అంచనాలు పెంచేస్తే.. తాజాగా శ్రియ నితిన్ అంధధూన్ రీమేక్ విషయంపై పెదవి విప్పింది. నితిన్ బాలీవుడ్ అంధధూన్ సినిమాని రీమేక్ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ సినిమా రీమేక్ చేస్తున్నాడు. అయితే బాలీవుడ్ అంధధూన్ లో బోల్డ్ పాత్రలో నటించిన టబు పాత్ర చెయ్యడానికి గాను తెలుగులో చాలామంది బోల్డ్ హీరోయిన్స్ ని నితిన్ సంప్రదించాడని కానీ.. వారు ఆ పాత్రలకు భారీ పారితోషకాలు  అడగడం, అలాగే ఆ పాత్ర చెయ్యడనికి ముందుకు రాకపోవడం జరిగింది అని.. నితిన్ సంప్రదించిన వారిలో నయనతార, ఇలియానా, రమ్యకృష్ణ లను అడిగినట్లుగా వార్తలు రావడం చివరికి టబు పాత్ర టబునే చేస్తుంది అనే ప్రచారం జరిగింది.

అయితే తర్వాత శ్రియ పేరు తెరపైకి వచ్చింది. అదే విషయాన్నీ శ్రియ ని అడిగితె.. నిజమే నితిన్ అంధధూన్ రీమేక్ లో టబు పాత్రకి నన్ను సంప్రదించారు. అయితే టబు పాత్రలో నేను నటించడం అనేది గౌరవంగా భావిస్తాను. కాకపోతే నేను ఇప్పుడు బార్సిలోనాలో ఉన్నాను. ఈ కరోనా పరిస్థితుల్లో షూటింగ్ మొద‌ల‌య్యేస‌రికి నేను ఇండియా రాగ‌ల‌నా? లేదా? అనే విషయం పై ఆలోచనలో ఉన్నా అని.. క్లారిటీ లేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది శ్రియ. మరి నితిన్ సినిమాలో ఫైనల్ గా శ్రియనే నటిస్తుంది ఆనేది మాత్రం ప్రేక్షకులకి క్లారిటీ ఇచ్చేసింది.

Tags:    

Similar News