డ్రగ్స్ తీసుకున్నా అంటున్న సాహో బ్యూటీ!!

ప్రస్తుతం బాలీవుడ్ డ్రగ్స్ కేసు హీరోయిన్స్ జీవితాన్ని ఆగమాగం చేస్తుంది. చిన్న హీరోయిన్స్ దగ్గరనుండి టాప్ హీరోయిన్స్ వరకు ఎన్ సీబీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. అందులో [more]

Update: 2020-09-28 07:25 GMT

ప్రస్తుతం బాలీవుడ్ డ్రగ్స్ కేసు హీరోయిన్స్ జీవితాన్ని ఆగమాగం చేస్తుంది. చిన్న హీరోయిన్స్ దగ్గరనుండి టాప్ హీరోయిన్స్ వరకు ఎన్ సీబీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. అందులో కొంతమంది నిజాలు చెబుతుంటే కొంతమంది మాత్రం తాము తప్పుచేయలేదని వాదిస్తున్నారు. అందులో రకుల్ ప్రీత్ సింగ్ తాను డ్రగ్స్ తీసుకోలేదని కానీ… తన ఫ్రెండ్ రియా చక్రవర్తి తన ఇంట్లో డ్రగ్స్ దాచుకునేది అంటూ తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంది. ఇక బాలీవుడ్ మరో హీరోయిన్ శ్రద్ద కపూర్ సుశాంత్ సింగ్ రాజపుట్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నానని.. అయితే తానూ కూడా ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా చెప్పి షాకిచ్చింది.

కానీ తనకు డ్రగ్స్ ఎవరు సరఫరా చేసారో పేర్లు చెప్పలేను, కానీ వారిని చూస్తే గుర్తు పడతా అని చెబుతుంది. ఇక సాహో బ్యూటీ శ్రద్ద కపూర్ సుశాంత్ సింగ్ రాజపుట్ తో చిచ్చోరె లో నటిచింది. అప్పుడే సుశాంత్ సింగ్ రాజపుట్ డ్రగ్స్ పార్టీకి అటెండ్ అయ్యా అని.. సుశాంత్ సింగ్ కూడా డ్రగ్స్ తీసుకునేవాడని.. ఇక అప్పుడప్పుడు సెట్స్ లోనే కార్ వ్యాన్ కి వెళ్లి సుశాంత్ సింగ్ డ్రగ్స్ సేవంచేవాడని చెబుతుంది శ్రద్ద కపూర్. ఇక తాను ఎవరికీ డ్రగ్స్ సరఫరా చెయ్యలేదని, ఎవరి దగ్గరా కొనలేదు, అమ్మలేదని శ్రద్ద కపూర్ ఎన్ సీబీ అధికారులకి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఈ లెక్కన సాహో బ్యూటీ శ్రద్దకపూర్ డ్రగ్స్ తీసుకుందని తేటతెల్లమైంది.

Tags:    

Similar News