మ‌హ‌ర్షికి వ‌రుస ఎదురుదెబ్బ‌లు..!

రేపు భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌వుతున్న మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి సినిమాకు వ‌రుస షాక్ లు త‌గులుతున్నాయి.ఆ చిత్ర స‌హ నిర్మాత దిల్ రాజు కార్యాల‌యంలో ఐటీ శాఖ [more]

Update: 2019-05-08 08:33 GMT

రేపు భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌వుతున్న మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి సినిమాకు వ‌రుస షాక్ లు త‌గులుతున్నాయి.ఆ చిత్ర స‌హ నిర్మాత దిల్ రాజు కార్యాల‌యంలో ఐటీ శాఖ సోదాలు జ‌రుపుతోంది. హైద‌రాబాద్ సాగ‌ర్ సొసైటీలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ కార్యాల‌యంలో సోదాలు జ‌రుగుతున్నాయి. మ‌హ‌ర్షి సినిమా పెట్టుబ‌డికి సంబంధించి నిధులు ఎక్క‌డి నుంచి స‌మ‌కూర్చార‌నే దిశ‌గా అధికారులు ఆరా తీయ‌నున్నారు. ఇక‌, మ‌హ‌ర్షి సినిమా టిక్కెట్ ధ‌ర‌ల పెంపున‌కు కూడా తెలంగాణ ప్ర‌భుత్వం బ్రేక్ వేయ‌నుంది. కోర్టు అనుమ‌తితో 79 థియేట‌ర్ల యాజ‌మానులు టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచుకున్నారు. ఈ విష‌య‌మై తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. టిక్కెట్ల ధ‌ర‌ల‌పై పెంపుపై పై కోర్టులో పిటీష‌న్ వేస్తామ‌ని, ధ‌ర‌ల పంపున‌కు అంగీక‌రించేది లేద‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News