చైతు-సాయి పల్లవి సినిమా ఎప్పుడో తెలుసా?

తొలిసారిగా నాగ చైతన్య ను డైరెక్ట్ చేయనున్నాడు యూత్ ఫుల్ చిత్రాలు చేసే శేఖర్ కమ్ముల. ప్రస్తుతం నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఎవరి సినిమా [more]

Update: 2019-07-11 07:54 GMT

తొలిసారిగా నాగ చైతన్య ను డైరెక్ట్ చేయనున్నాడు యూత్ ఫుల్ చిత్రాలు చేసే శేఖర్ కమ్ముల. ప్రస్తుతం నాగ చైతన్య అండ్ సాయి పల్లవి ఎవరి సినిమా షూటింగ్స్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. త్వరలోనే వీరిద్దరి ని డైరెక్ట్ చేయనున్నాడు శేఖర్. అటు యూత్ కి..ఇటు ఫామిలీ ప్రేక్షకులకి నచ్చే విధంగా శేఖర్ కథ ను బాగానే రాసుకున్నాడట.

మరో రెండు నెలల్లో అంటే సెప్టెంబర్ మొదటి వారం లో ఈసినిమా యొక్క మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. నవంబర్ చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసి డిసెంబర్ చివర ‘క్రిస్మస్’ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆ దశగా షూటింగు షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

శేఖర్ లాస్ట్ గా తీసిన చిత్రం ‘ఫిదా’. ఈమూవీ సూపర్ హిట్ అయింది. ఈమూవీ వచ్చి చాల కాలం అవుతుంది కానీ ఇంతవరకు శేఖర్ తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేయలేదు. కారణాలు ఏమైనా అయ్యి ఉండవచ్చు. లేట్ అయిన కానీ మంచి కాంబినేషన్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాడు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఇంకా తెలియాల్సిఉంది.

Tags:    

Similar News