శర్వానంద్‌ ప్రవర్తన మరోసారి రుజువైంది..!

Update: 2018-10-06 10:33 GMT

టాలీవుడ్ యంగ్ హీరోస్ గురించి తరుచు వినిపించే ఓ విమర్శ... సెట్స్ సరైన టైంకి రారని. ఇలా చాలా మంది చాలా సార్లు షూటింగ్ కి లేట్ గా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నితిన్, సందీప్ కిషన్, శర్వానంద్ లేట్ గా వస్తారని విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా హీరో శర్వానంద్‌పై ఇటువంటివి చాలానే వచ్చాయి. ప్రస్తుతం అతను హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచె మనసు’ చేస్తున్నాడు. రీసెంట్ గా కోల్‌కత్తాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇదే విషయమై శర్వానంద్‌ తీరుపై సాయిపల్లవి అసహనం వ్యక్తం చేసింది. శర్వానంద్‌ షూటింగ్ లేట్ గా వస్తాడని.. దీంతో ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయని ప్రచారం జరిగింది. అదేమీ లేదు సాయి పల్లవే షూటింగ్ లేట్ గా వస్తుందని కొందరి గుసగుస. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ తర్వాత సాయిపల్లవి అటువంటి గొడవలు ఏం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ శర్వానంద్‌ సెట్‌కి టైమ్‌కి రాడనే విషయం శుక్రవారం మరోసారి స్పష్టమైంది.

ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయకుండా...

‘పడి పడి లేచె మనసు’ షూటింగ్ హైదరాబాద్ లో ప్రసాద్ లాబ్స్ లో జరుగుతుంది. నిన్న ఉదయం అక్కడ కొన్ని సీన్స్ ను ప్లాన్ చేసాడు డైరెక్టర్ హను. ఈ సీన్స్ లో సాయి పల్లవి..శర్వానంద్ పై జరిగాయి. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు యూనిట్ మొత్తం ఖాళీగా కూర్చోవడం మీడియా వారికి కనిపించింది. వెంటనే వారి దగ్గరకు వెళ్లి ఏంటి అని ఆరా తీయగా… అసలు విషయం బయటపడింది. శర్వానంద్‌ రాలేదని..! యూనిట్ లో ఎవరి ఫోన్స్ లిఫ్ట్‌ చేయట్లేదని.. నిద్రలో ఉండటం వలన సెట్‌కి చెప్పిన టైమ్‌కి రాలేకపోయాడని తెలిసింది. ఎప్పుడో తీరికగా మధ్యాహ్నం 12 తర్వాత వచ్చి స్టార్ట్ చేసాడు. ఇలా లేట్ గా వస్తే ఎలా శర్వా..నీకు పర్సనల్ ప్రొబ్లెమ్స్ ఉండి ఉండొచ్చు కానీ ఇలా లేట్ గా వస్తే నిన్ను నమ్ముకుని చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా దీనివల్ల ప్రొడ్యూసర్ కి లాస్. సో ఆలోచించు..

Similar News