ఆసక్తికర విషయాలు చెప్పిన శర్వా

Update: 2018-11-15 06:07 GMT

ప్రస్తుత ఉన్న హీరోలలో సింపిల్ అండ్ స్టడీగా భిన్నమైన కథలతో విభిన్నమైన నటనతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు శర్వానంద్. ప్రస్తుతం అతను నటించిన 'పడి పడి లేచే మనసు' రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చే నెలలో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇప్పుడున్న హీరోలు అందరూ అవసరానికి మించి స్టోరీలో తల దూర్చుతున్నారన్న ప్రశ్నకు చాలా ఇంట్రెస్టింగ్ గా సమాధానం చెప్పాడు. "నా వరకు సినిమా వన్ మాన్ షో కాదని నమ్ముతానని చెప్పాడు. ప్రతి విషయంలో చాలా జాగ్రత్త పడతానని.. ప్రతీది సరిగా వస్తుందా లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటానని అన్నాడు. అనుకున్న విధంగా సినిమా రాకపోతే ఆ డైరెక్టర్ కు మొహం మీద చెప్పేస్తానని చెప్పాడు.

సుధీర్ వర్మ దర్శకత్వంలో...

ఈ సినిమా తరువాత శర్వా సుధీర్ వర్మ డైరెక్షన్ ఓ సినిమా చేయనున్నాడు. దానికి 'విరాట పర్వం' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. 'పడి పడి లేచే మనసు' తర్వాత దీనిపై ఒక క్లారిటీ రానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న 'పడి పడి లేచే మనసు' నుండి రీసెంట్ గా టీజర్ మరియు ఫస్ట్ సాంగ్ సింగిల్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. అలా శర్వా ప్రతి దాంట్లో అంటే స్క్రిప్ట్, కథల విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టే అతని సినిమా మినిమం హిట్స్ అవుతున్నాయేమో.

Similar News