మళ్లీ శర్వానంద్ తోనే..!

మొన్నటివరకు మినిమం గ్యారంటీ అన్నట్టు ఉందేది మారుతి కెరీర్. కానీ లేటెస్ట్ గా వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ దెబ్బతీసింది. ఓపెనింగ్స్ వరకు పర్లేదు అనిపించుకున్నా తరువాత [more]

Update: 2019-01-10 07:34 GMT

మొన్నటివరకు మినిమం గ్యారంటీ అన్నట్టు ఉందేది మారుతి కెరీర్. కానీ లేటెస్ట్ గా వచ్చిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ దెబ్బతీసింది. ఓపెనింగ్స్ వరకు పర్లేదు అనిపించుకున్నా తరువాత సినిమాను ఎవరూ పైకి లేపలేకపోయారు. ఈ సినిమా వల్ల మారుతికి నెగటివ్ కామెంట్స్ రావడంతో ఈసారి ఎలాగైనా మంచి కంటెంట్ తో సినిమా తీయాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. టాలీవుడ్ లో యంగ్ హీరోస్ చుట్టూ తన దగ్గర ఉన్న కథతో తిరుగుతున్నాడు. ఆ మధ్య అల్లు అర్జున్ కి ఒక కథ అనుకున్నాడు. అది అతనికి నచ్చిందని చెప్పారని త్వరలోనే వీరి కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందని వార్తలు కూడా వచ్చాయి కానీ బన్నీ ఏమో త్రివిక్రమ్ ని లైన్ లో పెట్టుకున్నాడు.

శర్వానంద్ తోనే మళ్లీ…

సరే అని విజయ్ దేవరకొండ దగ్గరకు వెళదాం అంటే అతను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. దీంతో ఏమి చేయాలో తెలియక మళ్లీ శర్వానంద్ వైపు ఇంట్రెస్ట్ చూపి అతనికి తాజాగా కథ చెప్పి ఓకే చేయించుకున్నాడట. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘మహానుభావుడు’ సినిమా హిట్టయిన సంగతి తెలిసిందే. రెండోసారి మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కబోతుంది. శర్వా కూడా హిట్ కోసం చూస్తున్నాడు. ‘పడి పడి లేచే మనసు’తో నిరాశ చెందిన శర్వా ప్రస్తుతం సుధీర్ వర్మ డైరెక్షన్ లో పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మారుతీ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశముంది.

Tags:    

Similar News