రూమర్స్ పై క్లారిటీ ఇచ్చాడు..!

Update: 2018-10-01 08:43 GMT

శంకర్ - రజనీ కాంబినేషన్ వస్తున్న ‘2.0’ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ ఫినిషింగ్ స్టేజి కి వచ్చింది. గత కొన్ని నెలల నుండి గ్రాఫిక్స్ వర్క్ లేట్ అవుతున్నా ఈ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఈనెలలోనే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకుని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ క్రో మ్యాన్ గా కనిపించనున్నాడని..లేదు అతను డాక్టర్ రిచర్డ్స్ పాత్రలో కనిపించనున్నాడని గత కొన్ని రోజులు నుండి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దానికి సంబంధించి డైరెక్టర్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.

రెండూ కాదన్న శంకర్...

అసలు ఇందులో అక్షయ్ పాత్ర క్రో మ్యాన్ కాదు, రిచర్డ్స్ కాదని... అతని పాత్ర ఎవరికీ అంతు చిక్కకుండా ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని శంకర్ తెలిపారు. దాంతో ఆ రూమర్స్ కి చెక్ పడినట్లయింది. ఏఆర్ రహమేన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర టీజర్ సెన్సషన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ట్రైలర్ వచ్చే నెల దీపావళి రోజున విడుదల అవ్వబోతుంది.

Similar News