అర్జున్ రెడ్డి పోరికి బంపర్ ఆఫర్

Update: 2018-04-09 08:45 GMT

అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన షాలిని పాండేకి ఆ సినిమా తో పిచ్చ క్రేజ్ వచ్చేసింది. ఆ సినిమా హిట్ తో అమ్మడుకి టాలీవుడ్ నుండి కోలీవుడ్ దాకా అవకాశాలే అవకాశాలే అన్నట్టుగా వుంది వ్యవహారం. కోలీవుడ్ లో 100 పెర్సెంట్ కాదల్ సినిమాలో నటిస్తున్న షాలిని పాండే తెలుగులో సావిత్రి బయో పిక్ మహానటిలోను నటిస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా క్రేజ్ తో షాలిని కి మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా షాలిని పాండేకి దిమ్మతిరిగిపోయే ఆఫర్ ఒకటి తలుపుతట్టినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ ఆఫర్ నిజమైతే నిజంగా షాలిని పంట పండినట్లే.

ఇంతకీ షాలినికొచ్చిన ఆఫర్ ఏమిటంటే.. మహేష్ బాబు పక్కన వంశి పైడిపల్లి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందనే టాక్ వినబడుతుంది. మహేష్ 25 మూవీ లో మహేష్ సరసన ప్రస్తుతం క్రేజ్ లో ఉన్న పూజ హెగ్డే ని తీసుకోగా... మరో కీలక పాత్ర కోసం వంశీ పైడిపల్లి షాలిని పాండేని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే షాలిని పాండే మహేష్ 25th మూవీ లో ఫైనల్ అని... కానీ చిత్ర యూనిట్ ఈ విషయాన్ని బయట పెట్టకుండా సస్పెన్సు లో పెట్టిందనే టాక్ వినబడుతుంది. ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న మహేష్ బాబు, వంశి పైడి పల్లి మూవీ కోసం త్వరలోనే సెట్స్ మీదకెళ్లనున్నాడు.

ఇకపోతే షాలిని పాండేకి మహేష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దొరికింది అంటే అమ్మడు క్రేజ్ మరింత పెరుగుతుంది. ఇక వరుసగా స్టార్ హీరోస్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ల నుండి కుర్ర హీరోలపక్కన హీరోయిన్ గా ఛాన్స్ లు పట్టేసే అవకాశం వుంది.

Similar News