బాక్సాఫీస్ వద్ద భార్యభర్తల హవా..!

Update: 2018-09-15 09:30 GMT

ఈ వారం రిలీజ్ అయిన భార్యభర్తల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద జోరు కొనసాగిస్తున్నాయి. సమంత నటించిన 'యూ-టర్న్'...నాగ చైతన్య నటించిన 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాల హవా బాక్సాఫీస్ వద్ద సాగుతోంది. 'యూ-టర్న్' చిత్రం ఎవరు ఊహించని విధంగా తొలిరోజు 2 కోట్లు వసూళ్లు సాధిస్తే.. 'శైలజారెడ్డి అల్లుడు' నాగచైతన్య కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 12కోట్లు వసూల్ చేసి కెరీర్ బెస్ట్ గా నిలిచింది.

దూసుకుపోతున్న శైలజారెడ్డి అల్లుడు

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టిస్తున్నాయి. 'యూ-టర్న్' మొదటిరోజు 2 కోట్ల గ్రాస్ వసూలు చేయగా..అందులో కోటి 10 లక్షల షేర్ వచ్చింది. చైతు 'శైలజారెడ్డి అల్లుడు' తొలిరోజు 12కోట్ల గ్రాస్ వసూల్ చేయగా..6.50 కోట్ల షేర్ ను వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. 'యూ-టర్న్' సినిమాకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటంతో అదే విధంగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక చైతు సినిమాకి మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ ఉన్నప్పటికీ అవన్నీ తుడిచి పెట్టేసి కలెక్షన్స్ ల సునామీ సృష్టించింది.

వీకెండ్ లోనూ వసూళ్ల జోరు...

ఈ రెండు సినిమాలకు ప్లస్ పాయింట్ ఏంటంటే వినాయక చవితి రోజు విడుదల అవ్వడం. దీనికి తోడు వీకెండ్ కావడం. శని - ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు. అంటే తొలి నాలుగు రోజుల్లో ఈ రెండు సినిమాలు చక్కని వసూళ్ల తో ట్రేడ్ లో ఉత్సాహం నింపే ఛాన్సుంది. 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 'యూ-టర్న్' మరో రెండు రోజుల్లో సేఫ్ జోన్ కి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు. అదే విధంగా 'శైలజారెడ్డి అల్లుడు'. ఈ రెండు రోజులు జోరు కొనసాగిస్తే ఇది కూడా సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు అని ట్రేడ్ అంటున్నారు. మరి వీకెండ్ రిపోర్ట్ ఏం వస్తుందో అని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Similar News