అనుకున్నంత పని చేసిన చైతూ

Update: 2018-08-21 03:29 GMT

గత వారం రోజులుగా నాగ చైతన్య - మారుతీ కాంబోలో తెరకెక్కిన శైలాజా రెడ్డి అల్లుడు చిత్రం పోస్ట్ పోన్ అవుతుంది... దానికి కారణం ఆ చిత్రం ఆర్ ఆర్ ఇంకా కంప్లీట్ కాకపోవడమనే టాక్ వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో వినబడుతూనే ఉంది. ఇక సినిమాకి రి రికార్డింగ్ పూర్తి కాకపోవడానికి కారణం కేరళ లో వచ్చిన వరదలు కారణంగా చెబుతున్నారు. మరి గత 10 రోజులుగా కేరళను ముంచెత్తిన భారీ వర్షాలతో కేరళ మొత్తం అతలా కుతలం అవడం.... కేరళలో నివాసముంటున్న శైలజ రెడ్డి అల్లుడు మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తో ఆర్ ఆర్ పూర్తి చేయించడానికి వెళ్లిన మారుతీ కేరళ వరదల్లో చిక్కుకుపోవడంతో... శైలజ రెడ్డి అల్లుడు చిత్రం ఆడియో కూడా పోస్ట్ పోన్ అవడం.... ఇక అప్పటినుండి ఈ చిత్రం రేపు ఆగష్టు 31 కి రావడం కల్లే అంటూ న్యూస్ లు వచ్చినా అటు నాగ చైతన్య కానీ.. ఇటు శైలాజా రెడ్డి అల్లుడు మేకర్స్ కానీ స్పందించకపోవడంతో ... శైలజ రెడ్డి అల్లుడు అసలు ఆగష్టు 31 న విడుదల ఉంటుందా లేదా అనే దానిమీద టోటల్ కన్ఫ్యూషన్ లో ఉన్నారు ప్రేక్షకులు.

తాజాగా నాగ చైతన్య శైలజ రెడ్డి అల్లుడు సినిమా విడుదలపై సోషల్ మీడియాలో స్పందించాడు. తమ సినిమా ఆగష్టు 31 న రావడం లేదని.. కేరళలో వచ్చిన వరదల వలన అనుకోకుండా శైలాజా రెడ్డి అల్లుడు చిత్రానికి రి రికార్డింగ్ పూర్తి కాకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సకాలంలో పూర్తి లేకపోవడంతో.. శైలాజా రెడ్డి అల్లుడు సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామని.. మరో మంచి డేట్ చూసుకుని శైలజ రెడ్డి అల్లుడు చిత్ర రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటిస్తారని.. తమ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నందుకు సిన్సియర్ గా క్షమాపణలు చెబుతున్నామని చైతు తన సోషల్ మీడియా పేజీ లో ట్వీట్ చేసాడు. సో శైలజ రెడ్డి హీరో నాగ చైతన్య ఆఫీషియల్ గా శైలజ రెడ్డి అల్లుడు పోస్ట్ పోన్ అయిన విషయాన్నీ ప్రకటించాడు.

అను ఇమ్మాన్యువల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ శైలజ రెడ్డి అనే పవర్ ఫుల్ అత్త పాత్రలో నటిస్తుంది. గోపి సుందర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం అసలైతే ఆగష్టు 31 న విడుదల కావాల్సి ఉంది. కానీ కేరళ వరదల కారణంగా మారుతి, గోపిసుందర్ అక్కడ ఇరుక్కుపోవడంతో... చేసేది లేక శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని పోస్ట్ పోన్ చెయ్యడం జరిగింది.

Similar News