విలన్‌గా మారిన అల‌నాటి న‌టి

Update: 2018-06-29 02:49 GMT

ఒకప్పుడు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అనేక సినిమాలు చేసింది అలనాటి నటి మధుబాల. ఆమె కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో 'రోజా', ‘జెంటిల్మెన్’ ముందు వరసలో ఉంటాయి. గత కొంత కాలం నుండి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. రీసెంట్ గా నిఖిల్ ‘సూర్య వెర్సెస్ సూర్య', నాన్నకు ప్రేమతో సినిమాలో పలు కీలక పాత్రల్లో నటించారు.

మొద‌టిసారి విల‌న్‌గా

ప్రస్తుతం తమిళం లో బాబీ సింహ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రంలో ఆమె ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆ సినిమాలో ఆమె భిన్నమైన విలన్ పాత్ర చేయనుందని అక్కడ కోలీవుడ్ మీడియా కథ‌నాలు. ఇలా ఆమె నెగటివ్ రోల్ కనిపించడం ఇదే మొదటిసారి. ఆమె నటన అంటే ఇప్పటికి ఇష్టపడేవాళ్లు చాలా మంది ఉన్నారు. మధుబాల తొలిసారిగా విలన్ పాత్ర చేస్తుండడంతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఈ చిత్రాన్ని ఇద్దరు డైరెక్టర్స్ డైరెక్ట్ చేస్తున్నారు. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్యలు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Similar News