గెస్ట్ హౌజ్ లకు రమ్మని పిలిచేవారు

Update: 2018-07-03 09:57 GMT

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో వెలుగు వెలిగి, పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన నటి ఆమని ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చింది. గతంలో బాలకృష్ణ, నాగార్జున, విజయ్ కాంత్, మమ్ముట్టీ వంటి స్టార్ హీరోలతో నటించి దక్షిణాది సినిమాల్లో మంచి పేరు సంపాదించిన ఆమె ఇటీవల ఐపీసీ సెక్షన్ భార్యాబంధు సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించారు. అయితే, తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో కొత్త ప్రొడక్షన్ హౌజ్ ల నుంచి ఫోన్లు చేసి గెస్ట్ హౌజ్ లకు, హోటళ్లకు ఒంటరిగా రమ్మని పిలిచేవారని, కానీ వెంటనే విషయం అర్థమై కట్ చేసేదాన్నని చెప్పారు. అయితే, ఇటువంటి చర్యలు కేవలం కొత్త సంస్థల పేరుతోనే చేశేవారని, అసలు వారు సినిమా తీస్తారో, తీయరో కూడా తెలియదని పేర్కొన్నారు. ప్రముఖ సంస్థలు గానీ, దర్శకులు గానీ ఇటువంటివి ఎప్పుడూ చేయరని ఆమె స్పష్టం చేశారు.

Similar News