కష్టాల్లో అనుష్క

బాహుబలి తర్వాత భాగమతి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ని ప్రేక్షకులు మర్చిపోయేలా ఉన్నారు. ఎందుకంటే నిశబ్దం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్న అనుష్క సినిమాకి [more]

Update: 2020-01-21 07:33 GMT

బాహుబలి తర్వాత భాగమతి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క ని ప్రేక్షకులు మర్చిపోయేలా ఉన్నారు. ఎందుకంటే నిశబ్దం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్న అనుష్క సినిమాకి కష్టాలు చుట్టుముట్టి వాయిదాపడినట్లుగా తెలుస్తుంది. కారణాలు తెలియవు కానీ.. నిశ్శబ్దం వాయిదా పడడంతోనేనా సినిమా ప్రమోషన్స్ ఆపేశారని అంటున్నారు. ఇప్పటివరకు పోస్టర్స్ తో హడావిడి చేసిన నిశ్శబ్దం టీం ఇప్పుడు సైలెంట్ అయ్యింది. ఇక అనుష్క క్రేజ్ కూడా అంతకంతకు తగ్గిపోతుంది. కారణం సినిమాలకు భారీ గ్యాప్ రావడంతో.. అందరూ అనుష్క ని లైట్ తీసుకుంటున్నారు.

అందుకే అనుష్క నిశ్శబ్దంపై క్రేజ్ రావడం లేదు. ఇప్పటికె చేతిలో సినిమాలు లేవు.. ఉన్న సినిమా ని విడుదల చెయ్యడానికి నానా కష్టాలు పడుతుంది. అనుష్క లావుగా ఉన్నప్పటికీ.. ఆమెకి అవకాశాలొచ్చాయి కాని అనుష్క మాత్రం వాటిని వద్దని.. బరువు తగ్గడానికి టైం తీసుకుని. అలా ఆటోమాటిక్ గా క్రేజ్ కోల్పోయింది. ఒకప్పుడు అనుష్క సినిమా అంటే అబ్బో అనేవారు.. ఇప్పుడు అనుష్క సినిమా అంటే ఆహా అంటున్నారు అంటే అనుష్క పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇక అనుష్క కూడా నిశ్శబ్దం సినిమా విడుదల విషయంలో టెన్షన్ పడడమే కాకుండా.. నిర్మాతలను కూడా ఒత్తిడి చేస్తూ సినిమా విడుదలకు మార్గం చూడమని చెబుతుందని అంటున్నారు. ఇప్పటికే నిశ్శబ్దం నిర్మాతలకు అనుష్క కి మధ్య ఈ విషయంలో గ్యాప్ వచ్చినట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి

Tags:    

Similar News