శేఖర్ కమ్ముల ఆ ప్రాజెక్ట్ ని సగంలో ఆపేశాడు!

ఫిదా లాంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుండి వస్తున్నా చిత్రం నాగ చైతన్య తోనే. సాధారణంగా శేఖర్ కమ్ముల పెద్ద హీరోస్ ని [more]

Update: 2019-06-22 05:12 GMT

ఫిదా లాంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుండి వస్తున్నా చిత్రం నాగ చైతన్య తోనే. సాధారణంగా శేఖర్ కమ్ముల పెద్ద హీరోస్ ని బెట్టి సినిమాలు తీయడు. తనకు కొత్తవాళ్ళతోనే సినిమాలు చేయడం ఇష్టం. కాకపోతే వరుణ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరోస్ ని పెట్టి సినిమా తీసాడు. ఇది హిట్ అయింది. అయితే ఆ తరువాత కూడా ‘హ్యాపీడేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ తరహాలో అందరూ కొత్తవాళ్లతో ఒక యూత్ ఫుల్ మూవీ మొదలుపెట్టాడు. స్టోరీ మొత్తం రెడీ చేసుకుని కొత్తవాళ్ళని ఎంపిక చేసుకుని సెట్స్ మీదకు కూడా వెళ్ళాడు. అయితే సడన్ గా శేఖర్ నాగచైతన్యతో సినిమా అంటూ అప్ డేట్ వచ్చింది. ప్రస్తుతం శేఖర్ చేస్తున్న సినిమా తరువాత చైతు తో సినిమా ఉంటుందని అంత అనుకున్నారు.

కానీ ఇది నిజం కాదని తెలుస్తుంది. శేఖర్ చేస్తున్న సినిమా ఏషియన్ సినిమా అధినేత సునీల్ నారంగ్ నిర్మాణంలో జరుగుతుంది. ఈసినిమా యొక్క ఔట్ పుట్ అనుకున్నట్లుగా రాలేదట. మధ్యలో రషెస్ చూసుకుని దర్శక నిర్మాతలిద్దరూ అసంతృప్తికి లోనయ్యారట. ఈ మూవీ ఎట్టిపరిస్థితుల్లో వర్క్ అవుట్ కాదనే ఉద్దేశంతో దాన్ని మధ్యలో వదిలేద్దామని నిర్ణయించుకున్నారట. ఈమూవీ కి అప్పటికే నాలుగైదు కోట్ల దాకా ఖర్చు పెట్టినప్పటికీ.. అయినా పర్వాలేదని సినిమాను ఆపేసినట్లు చెప్పుకుంటున్నారు. దాంతో ఆ సినిమా ఆగిపోయిందని అందుకే కమ్ముల-చైతూ-సాయిపల్లవి కాంబినేషన్లో సెట్స్ మీదకు వచ్చిందని వార్తలు వస్తుంది. అయితే ఈమూవీ సెప్టెంబరులో సెట్స్ మీదికి వెళ్లనుంది.

Tags:    

Similar News