సీడెడ్ లో అదరగొట్టింది…!

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఓ పాట మినహా మహర్షి షూటింగ్ పూర్తవుతుంది. [more]

Update: 2019-04-09 10:54 GMT

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఓ పాట మినహా మహర్షి షూటింగ్ పూర్తవుతుంది. ఇక మరోపక్క ఆ పాట చిత్రీకరణతో పాటుగా వంశీ పైడిపల్లి పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు మహర్షి ప్రమోషన్స్ ని మొదలు పెట్టేసాడు. ఉగాది కానుకగా విడుదల చేసిన మహర్షి టీజర్ కి మిశ్రమ స్పందన వచ్చినా.. యూట్యూబ్ లో మాత్రం మహర్షి టీజర్ కొత్త రికార్డులకు నెలవుగా మారింది. ఇక మహేష్ బాబు మహర్షి షూటింగ్ అయిపోగా.. తన పాత్రకి డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశాడు.

రికార్డు ధరలకు సీడెడ్ హక్కులు

ఇక ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్ లో కొన్ని ఏరియాలలో అదరగొట్టిన మహర్షి ఇప్పుడు సీడెడ్ లో సూపర్ గా బిజినెస్ చేసింది. మహర్షి సీడెడ్ రైట్స్ 12.6కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. మరి శాటిలైట్, హిందీ హక్కులు, డిజిటల్ రైట్స్ విషయంలో సంచలనాలకు నెలవుగా మారిన మహర్షి విడుదల సమయానికి ఇంకెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి. ఇక మహర్షి సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. అల్లరి నరేష్ మహేష్ ఫ్రెండ్ గా కీలక రోల్ ప్లే చేస్తున్నాడు.

Tags:    

Similar News