విశాల్ ఇంటివద్ద పోలీసుల భద్రత!

Update: 2018-05-12 09:57 GMT

విశాల్ హీరోగా మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘ఇరుంబు తిరై’. తమిళనాట సమ్మె తర్వాత ఈ నెల 11న విడుదల అయిన ఈ చిత్రంలో విశాల్ కి జోడిగా సమంత నటించింది. రిలీజ్ అయిన అన్ని చోట్ల ఈ చిత్రం కి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో ఒక సీన్ గురించి హిందూ సంస్థలు ఆరోపిస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాయి.

ఈ సినిమాలో ఆధార్ కార్డుకు సంబంధించి తప్పుడు సమాచారమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’పై ఈ చిత్రంలో విమర్శించినట్టు ఉంది. అందుకే వారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమాను ఆపివేయాలని పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది.

దీనిపై నిరసనలు వ్యక్తం చేస్తున్న హిందూ సంస్థలు హీరో విశాల్ ఇంటిని ముట్టడించనున్నట్టు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో హీరో విశాల్ ఇంటి ముందు భారీ పోలీసులు భద్రత కల్పించారు. సినిమాకు పాజటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే విధంగా వస్తాయని కోలీవుడ్ వర్గాల సమాచారం.

Similar News