ఈ సినిమా రిజల్ట్ వారిని జాగ్రత్త పడేలా చేసింది

Update: 2018-11-04 04:56 GMT

ఈ శుక్రవారం రిలీజ్ అయినా 'సవ్యసాచి' మూవీ ఓవరాల్ గా ప్లాప్ టాక్ తెచ్చుకుని చైతుకు హ్యాట్రిక్ పూర్తి చేయించింది. అతకముందు 'యుద్ధం శరణం'..'శైలజారెడ్డి అల్లుడు' వచ్చి డిజాస్టర్ గా నిలవడంతో మూడో ప్లేస్ లో 'సవ్యసాచి' చేరి హ్యాట్రిక్ గా నిలిచింది. అయితే ఇంకో విషయం ఏంటంటే... 'సవ్యసాచి' నిర్మించిన మైత్రి మూవీస్ వారికి ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా లేదు. ఈసినిమాతో బోణి కొట్టారు.

మైత్రి బ్యానర్ లో 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం' లాంటి ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. ఈసినిమా ప్లాప్ అవ్వడంతో వీరి బ్యానర్ లో ఈనెల ఆఖరికి వస్తున్నా 'అమర్ అక్బర్ ఆంటోనీ మీద సైతం అనుమానాలు ఉన్నాయి ప్రేక్షకుల్లో. రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో కాబట్టి ప్రేక్షకుల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ సినిమా హిట్ అయితే ఫ్యాన్స్ కు అంత కన్నా ఆనందం ఏమి ఉండదు.

మైత్రి మూవీ వారు ఈసినిమాలే కాకుండా మరికొన్ని సినిమాలను లైన్ లో పెట్టారు. రవితేజ - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ ఓ సినిమా రాబోతుంది. త్వరలోనే ఆ డీటెయిల్స్ చెప్పనున్నారు. సాయి ధరమ్ తేజ్ - కిషోర్ తిరుమల కాంబినేషన్ లో 'చిత్రలహరి' అనే సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈసినిమా వచ్చే ఏడాది స్టార్టింగ్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. వచ్చే ఏడాది లోపు మైత్రి నుంచి సుమారు ఏడు దాకా సినిమాలు ఉండే అవకాశం ఉంది. 'సవ్యసాచి' ఫలితం తో మైత్రి వారు కొంచం జాగ్రత్త పడ్డారు అని తెలుస్తుంది. చైతు కూడా ఆచి తూచి అడుగులు వేస్తే బెటర్ అని లేకపోతే తన కెరీర్ కు ఎండ్ కార్డు పడడం కాయం అని అంటున్నారు

Similar News