రెండూ లాగించేస్తున్నాడు!!

Update: 2018-04-15 03:59 GMT

గత ఏడాది 'శతమానం భవతి, రాధ, మహానుభావుడు' చిత్రాలతో చుట్టేసిన శర్వానంద్ ఈ ఏడాది హను రాఘవపూడి 'పడి పడి లేచే మనసు' తో పాటు అదే టైం లో సుధీర్ వర్మ దర్శకత్వంలో ను మరో సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పడి పడి లేచే మనసు' సినిమా షూటింగ్ ను పరిగెత్తిస్తున్నాడు. ఈ సినిమా దేశభక్తి బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతుండగా... శర్వానంద్ ఈ సినిమా లో కొత్తగా కనిపించనున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన సాయి పల్లవి నటిస్తుంది.

టైటిల్ ఇంకా పెట్టలేదు కాని....

ఇక హను తో కలిసి చేస్తున్న సినిమాతో పాటు సుధీర్ వర్మ డైరెక్షన్ లోను నటిస్తున్నాడు శర్వా. సుధీర్ వర్మ - శర్వానంద్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకి టైటిల్ ఇంకా పెట్టలేదు గాని... సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుంది. శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా డిఫరెంట్ లుక్ లో దర్శనమీయబోతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తూన్నారు. అయితే ఈ షెడ్యూల్ నిన్నటితో అక్కడ కంప్లీట్ అయ్యింది.

తర్వాత కూడా విశాఖలోనే....

ఇక తర్వాత షెడ్యూల్ ని కూడా వైజాగ్ కి దగ్గరోలోనే అంటే... కాకినాడలో ప్లాన్ చేశారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ సరసన 'హలో' ఫెమ్ కళ్యాణి ప్రియదర్శి నటిస్తుంది. మరి ఒకేసారి శర్వానంద్ రెండూ సినిమాల్తో ఫుల్ బిజీగా మారిపోయాడు.

Similar News