యంగ్ హీరో చుట్టూ తిరుగుతున్న దర్శకులు

Update: 2018-07-20 09:09 GMT

ఒకప్పుడు తప్పటడుగులు వేసినా.. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న శర్వానంద్ మాత్రం మంచి కథలను ఎంపిక చేసుకుంటూ.. హిట్స్ కొడుతున్నాడు. ఇక కథలో కొత్తదనం లేకపోతె శర్వానంద్ మొదటి నుండి తొందరగా ఒప్పుకునే రకం కాదు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తప్పులు చేసినా.. ప్రస్తుతమైతే. చాలా మెచ్యూర్డ్ గా సినిమా లు చేసుకుపోతున్నాడు. అలాగే శర్వానంద్ సినిమా షూటింగ్స్ కూల్ గా చేస్తాడు..హరీబరిగా ఒకేసారి రెండు సినిమాలు చెయ్యడని చెబుతుంటారు. కానీ ప్రస్తుతమైతే.. హను రాఘవపూడి తో పాటుగా సుధీర్ వర్మ తో మరో సినిమాని పట్టాలెక్కించాడు శర్వానంద్.

హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమాని సాయి పల్లవి తో కలసి నటిస్తున్నాడు. సాయి పల్లవి నటన తో పాటు ఆమె అందం ఈ సినిమా కి హెల్ప్ అవుతాయని.. అలాగే శర్వానంద్ క్రేజ్ కూడా సినిమాకి ప్లస్ అవుతుందని చిత్ర బృందం చెబుతున్న మాట. ఇక భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాతో పాటుగా సుధీర్ వర్మ సినిమాని ఒప్పుకున్న శర్వానంద్ ఇంకా సుధీర్ వర్మ తో పాటుగా రెగ్యులర్ షూటింగ్ లో అయితే ప్రస్తుతం పాల్గొనడం లేదు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత శర్వానంద్ తో కలిసి పని చెయ్యడానికి చాలామంది దర్శకునిర్మాతలు పోటీపడుతున్నారు.

తాజాగా శర్వానంద్ ని తన మల్టీస్టారర్ లో ఒప్పించడానికి ఇంద్రగంటి మోహన కృష్ణ రేడి అవుతున్నాడట. ఇక ఈ సినిమా లో శర్వానంద్ తో పాటుగా మరో హీరో నాని ని కూడా ఇంద్రగంటి సెట్ చేసే పనిలో ఉన్నాడట. అలాగే శర్వానంద్ కి మరో దర్శకుడు కూడా కథ వినిపించాడంటున్నారు. శ్రీకాంత్ అడ్డాలతో పాటుగా శ్రీనివాసరాజు అనే దర్శకుడు కూడా శర్వానంద్ కి కథ వినిపించే ప్రయత్నాల్లో ఉన్నారనే టాక్ తో పాటుగా... మరికొంతమంది శర్వాని కలిసి కథ చెప్పాలని ఉవ్విళ్లూరుతున్నారట. మరి మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న శర్వాతో సినిమాలు చెయ్యడానికి దర్శక నిర్మాతలకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. అలాగే ఆ హీరో మీద వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అందుకే శర్వా చుట్టూ ఇంతమంది దర్శకులు పడుతున్నారు. ఇక ఎన్ని కథలు వింటున్నప్పటికీ.. శర్వా మాత్రం తొందరపడి ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తుంది.

Similar News