సర్కారు వారి హీరోయిన్ ఆమె?

మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట సినిమా ల డౌన్ ముగియగానే సెట్సమీదకెళ్తుంది అనుకుంటే మహేష్ మాత్రం ఇంకా షూటింగ్ కోసం [more]

Update: 2020-06-19 10:27 GMT

మహేష్ బాబు – పరశురామ్ కాంబోలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట సినిమా ల డౌన్ ముగియగానే సెట్సమీదకెళ్తుంది అనుకుంటే మహేష్ మాత్రం ఇంకా షూటింగ్ కోసం సిద్దమవడం లేదు. కరోనా ఉదృతి తగ్గేవరకూ మహేష్ సర్కారు వారి పాట సెట్స్ మీదకెళ్లే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలంతా ఒకే మాటమీదున్నారు. కరోనా కాలాన్ని జయిద్దాం. తరవాతే షూటింగ్ అని. ఇక మహేష్ కోసం పరశురామ్ హీరోయిన్స్ వేటలో ఉన్నాడని సర్కారు వారి పాట హీరోయిన్ గా బాలీవుడ్ భామే రాబోతుంది అని అన్నారు. అందులో సాయి మంజ్రేకర్ పేరు బాగా తెరపైకి వచ్చింది. మధ్యలో మహానటి కీర్తి సురేష్ పేరు కూడా వినబడింది.

అయితే తాజాగా సర్కారు వారి పాట హీరయిన్ కీర్తి సురేష్ అని ఫిక్స్ అయినట్టుగా వార్తలు రావడం.. పెంగ్విన్ విడుదల కోసం ఇస్తున్న ఇంటర్వూస్ లోను, లైవ్ చాట్ లోను కీర్తి సురేష్ మహేష్ సినిమా కోసం పని చెయ్యబోతునట్టుగా కన్ఫర్మ్ చెయ్యడంతో.. కీర్తి సురేష్ మహేష్ సర్కారు వారి పాట హీరోయిన్ గా గా ఫిక్స్ అని త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది అంటున్నారు. అయితే మహానటి కన్నా ముందు స్టార్ హీరో పవన్ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కి ఆజ్ఞాతవాసి అట్టర్ ప్లాప్ ఇస్తే.. ఇప్పుడు మహేష్ అయినా కీర్తి కి సర్కారు వారి పాట తో హిట్ ఇవ్వలేకపోతే స్టార్ హీరోలు కీర్తికి కలిసి రారేమో అంటున్నారు. 

Tags:    

Similar News