రెండు సార్లు నో చెప్పిన శర్వా

Update: 2018-12-20 04:02 GMT

ఈ శుక్రవారం ఒకటికి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొంచం బజ్ ఉన్న చిత్రం శర్వానంద్ - సాయి పల్లవి నటించినా 'పడి పడి లేచే మనసు'. శర్వా తన కెరీర్ లో సక్సెస్.. ఫెయిల్యూర్ తో కంటెంట్ నే నమ్ముకుంటూ సినిమాలు చేస్తున్నాడు. నిజానికి శర్వా కి సక్సెస్ రేట్ కూడా ఎక్కువే. కేవలం కంటెంట్ కె ఇంపార్టెన్స్ ఇచ్చే శర్వా ఒక బ్లాక్ బస్టర్ సినిమాను కూడా వదులుకున్నాడు.

అదే 'అర్జున్ రెడ్డి'. మొదటి డైరెక్టర్ సందీప్ వంగా 'అర్జున్ రెడ్డి' స్టోరీ శర్వాకే చెప్పాడట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేదు. రీసెంట్ గా 'పడి పడి లేచే మనసు' ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్నీ చెప్పాడు శర్వా. అలానే సందీప్ వంగా మరో లవ్ స్టోరీ చెప్పితే అది కూడా రిజెక్ట్ చేశాసాని చెప్పాడు. ఇలా చేయడానికి కారణం తన పాత్రలో నటించడానికి కంఫర్టబుల్ గా అనిపించాలట. అప్పుడే కథను ఓకే చేస్తా అని చెబుతున్నాడు. అలా అనిపిస్తే ఏ కథ అయినా ఓకే చేస్తానని తెలిపాడు.

కారణం ఏదైనా సందీప్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కి నో చెప్పడం అంటే సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం శర్వా సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ పీరియడ్ మూవీ చేస్తున్నాడు. సగం పూర్తి చేసుకున్న ఈసినిమా తరువాత శర్వా '96' రీమేక్ లో చేస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ఇది అధికారంగా ప్రకటించలేదు.

Similar News