జైలు లో రచ్చ చేస్తున్న హీరోయిన్?

లక్ష్మి మంచు అన్నట్టుగా ఇప్పుడు ఇండియా లో కరోనా కన్నా పెద్ద సమస్య సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ విషయం. లక్ష్మి మంచు కరోనా చిన్న విషయం అన్నటుగా [more]

Update: 2020-09-12 04:41 GMT

లక్ష్మి మంచు అన్నట్టుగా ఇప్పుడు ఇండియా లో కరోనా కన్నా పెద్ద సమస్య సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ విషయం. లక్ష్మి మంచు కరోనా చిన్న విషయం అన్నటుగా ఉంటే.. సుశాంత్ రాజపుట్ ఆత్మహత్య కేసు పెద్ద వివాదంలా మారిందిగా అంటూ ట్వీట్ చేసింది. నిజం గా లక్ష్మి అన్నట్టుగానే ఇప్పుడు కరోనా కన్నా పెద్ద సమస్య డ్రగ్స్. కన్నడ, బాలీవడ్ లలో సినిమా ప్రముఖులతో ఈ డ్రగ్ కేసు ముడిపడి ఉండడంతో ఇప్పుడు అందరి చర్చ ఈ డ్రగ్ కేసు గురించే. బాలీవుడ్ లో  డ్రగ్ కేసులో రియా చక్రవర్తి అరెస్ట్ అవడమే కాదు.. రియా ఇప్పుడు బాలీవుడ్ లో ఏయే ప్రముఖుల పేర్లు బయటపెడుతుందో అనే టెంక్షన్. మరోపక్క శాండిల్ వుడ్ లో నటి రాగిణి ద్వేవేది, సంజనల వరస అరెస్ట్ లు అందరిలో కంగారు పుట్టిస్తున్నాయి. హీరోయిన్ రాగిణి ద్వివేది ని అరెస్ట్ చేసిన కొన్ని గంటలకే నటి సంజనని ఈ డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసారు.

నేను అమాయకురాలిని, అన్యం పుణ్యం ఎరగని అమ్మాయిని, నాకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదు. నేను డ్రగ్స్ సేవించలేదంటూ గొడవ చేసినా సంజన అరెస్ట్ చెయ్యడం అనివార్యం అయ్యింది. అయితే తాజాగా సంజన జైల్లో రచ్చ చేసింది అని… బెంగుళూరు లోని ఓ హాస్పిటల్ కి డోప్ టెస్ట్ కోసం తీసుకెళ్లగా తాను టెస్ట్ చేయించుకొనని, నన్నెందుకు అరెస్ట్ చేసారు. మీరంతా కలిసి నన్ను బకరాని చేసారు. నేనేందుకు డోప్ టెస్ట్ చేయించుకోవాలి, నేనెలాంటి తప్పు చెయ్యలేదు, నన్నెదుకు అరెస్ట్ చేసారో నాకిప్పటికీ అర్ధం కావడం లేదంటూ సంజన చేసిన రచ్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క రియా చక్రవర్తి కేసులో రియా బెయిల్ కి అప్లై చేసినా.. బెయిల్ పిటిటీషన్ కోర్టు తిరక్సరించింది. దానితో రెండోసారి రియా బెయిల్ రాకుండా పోయింది.  

Tags:    

Similar News