మహేష్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Update: 2018-04-27 09:03 GMT

అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ సందీప్ వంగ తన నెక్స్ట్ మూవీపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబు తో ఉంటుందని అంత అనుకున్నారు. మహేష్ కూడా సందీప్ తో సినిమా చేస్తున్నాని ఓ క్లారిటీ ఇచ్చాడు కానీ ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో చెప్పలేదు.

కానీ సందీప్ మాత్రం తన మూడో సినిమా మహేష్ తో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం సందీప్ అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో చేయటానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రం జులైలో సెట్స్ మీదికి వెళ్తుందని సందీప్ ప్రకటించాడు. ఆరు నెల్లో ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమా పూర్తి అవ్వగానే మహేష్ తో సినిమాకు రెడీ అవ్వుతానని చెప్పాడు సందీప్.

కొన్ని రోజుల కిందే మహేష్ ను కలిసాని మా ఇద్దరి మధ్య చర్చలు చాలా సానుకూల వాతావరణంలో జరిగాయని.. కొన్ని ఐడియాలు డిస్కస్ చేశామని సందీప్ తెలిపాడు. అర్జున్ రెడ్డి రీమేక్ అయ్యాక మహేష్ ప్రాజెక్ట్ చేస్తానని అతనన్నాడు. ప్రస్తుతం మహేష్.. వంశీ పైడిపల్లి సినిమాను మొదులపెట్టబోతున్నాడు. దాని తర్వాత సుకుమార్ సినిమాను అనౌన్స్ చేసినప్పటికీ.. ఆ సమయానికి సుక్కు స్క్రిప్టు రెడీ చేస్తాడా అన్నది డౌటు. ఒకవేళ సందీప్ స్క్రిప్ట్ రెడీగా ఉంటె సందీప్ సినిమా చేసే అవకాశముంది. ఒకవేళ సుక్కు సినిమా ముందు వస్తే సందీప్ కొంత కాలం మహేష్ కోసం ఖాళీగా ఉండాల్సిందే.

Similar News