ఇక్కడ హడావిడే.. అక్కడేం లేదు?

నిన్నమొన్నటివరకు బాలీవుడ్ ని డ్రగ్స్ కేసు ఓ ఊపు ఊపింది. దీపికా దగ్గరనుండి శ్రద్ద కపూర్, సారా అలీ ఖాన్ లను ఎన్సీబీ విచారణ మీడియాలో రసవత్తరంగా [more]

Update: 2020-10-18 06:43 GMT

నిన్నమొన్నటివరకు బాలీవుడ్ ని డ్రగ్స్ కేసు ఓ ఊపు ఊపింది. దీపికా దగ్గరనుండి శ్రద్ద కపూర్, సారా అలీ ఖాన్ లను ఎన్సీబీ విచారణ మీడియాలో రసవత్తరంగా ప్రసారం అయ్యింది. రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి బాలీవుడ్ లో బడా ప్రముఖుల పేర్లు బయట పెట్టడంతో ఎన్సీబీ అధికారులు హడావిడిహడావిడీ చేసి హీరోయిన్స్ ని విచారణకు పిలిచారు. అదిగో అక్కడ హీరోయిన్స్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇక ఆ ఫోన్ డేటా మరిన్ని బాలీవుడ్ డ్రగ్స్ లింకులు బయటపడతాయి అని మీడియాలో న్యూస్ కూడా వచ్చింది.. ఇక డ్రగ్స్ కేసులో రియా కి బెయిల్ వచ్చింది డ్రగ్స్ కేసు ముచ్చట మీడియాలో వినబడితే ఒట్టు. బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు నీరుగారిందనే ప్రచారం ఊపందుకుంది.

కానీ శాండిల్ వుడ్ ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు మాత్రం ఇంకా వేడిగానే ఉంది. శాండిల్ వుడ్ లో సంజన, రాగిణి త్రివేది లాంటి హీరోయిన్స్ ఎన్సీబీ అధికారుల రిమాండ్ లో ఉన్నారు. వారు కాస్త అతి చేసినా అధికారులు ఎలాగోలా అసలు విషయాన్నీ రాబడుతున్నారు. సంజనకు కానీ, రాగిణి ద్వివేదీకి కానీ బెయిల్ రాకుండా గట్టిగా పట్టుకున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ చుట్టూ ఈ డ్రగ్స్ ఉచ్చు బిగుసుకుంటుంది. వివేక్ బావమరిది ఆదిత్య ఈ కేసు విషయంలో ఇప్పటికే పరారిలో ఉండగా.. ఇప్పడు వివేక్ ఒబెరాయ్ భార్య కి ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. మరి శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు కి ఇంకా శుభం కార్డు పడినట్లుగా లేదు.. అదే బాలీవుడ్ లో అయితే డ్రగ్స్ కేసుకి ఆల్మోస్ట్ శుభం కార్డు పడినట్లే అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది.

Tags:    

Similar News