ముంబై లో నీతా అంబానీ.. హైదరాబాద్ లో సమంత?

ముంబై లో ధీరూభాయ్ అంబానీ కొడుకు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఓ ఇంటెర్నేషనల్ స్కూల్ కి చైర్మన్. ఆమె ఆ స్కూల్ పెట్టింది కేవలం [more]

Update: 2020-02-27 05:37 GMT

ముంబై లో ధీరూభాయ్ అంబానీ కొడుకు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఓ ఇంటెర్నేషనల్ స్కూల్ కి చైర్మన్. ఆమె ఆ స్కూల్ పెట్టింది కేవలం సెలెబ్రిటీ పిల్లల కోసమే అన్నట్టుగా… ఆ స్కూల్ లో ఐశ్వర్య రాయ్ కూతురు, షారుఖ్ ఖాన్ కొడుకు, కరీనా – సైఫ్ కొడుకు తైమూర్, ఇంకా బిజినెస్, డాక్టర్స్, పొలిటీషియన్స్ పిల్లలు అక్కడే చదువుతున్నారు. మామగారు పేరు ధీరూభాయ్ అంబానీ పేరు మీద ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతున్న నీతా అంబానీ.. ఆ స్కూల్ ని చాలా ప్రత్యేకంగా సెలబ్రిటీస్ పిల్లల కోసం తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది. ఆ స్కూల్ లో పిల్లలు చదవాలంటే కోట్లు ఖర్చు పెట్టాలంటారు.

మరి అలాంటి స్కూల్ నే ఇక్కడ హైదరాబాద్ లోను సమంత ఒకటి మొదలెట్టింది. తాజాగా హాట్ అండ్ టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత స్కూల్ బిజినెస్ మొదలెట్టిన సంగతి తెలిసిందే. డిజైనర్ శిల్ప రెడ్డి తో కలిసి EKAM లెర్నింగ్ సెంటర్ పేరుతో హై క్లాస్ ప్లే స్కూల్ ని సమంత మొదలు పెట్టింది. మరి సమంత స్కూల్ కూడా సెలెబ్రిటీస్ పిల్లలకు మాత్రమే అనేలా కనబడుతుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరు శ్రీజ కూతురు, ఇంకా చాలామంది సెలబ్రిటీస్ పిలల్లు ఇక్కడే జాయిన్ అయ్యేలా సమంత ప్లానింగ్ ఉంది. తాజాగా ఓపెన్ అయిన ఈ స్కూల్ కూడా చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. అంటే సమంత ఎలాగూ సెలెబ్రిటీస్ మధ్యన స్కూల్ ఓపెన్ చేసింది కాబట్టి.. సమంత స్కూల్ ది బెస్ట్ అనుకునేలా ఉంది కాబట్టి.. టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సమంత స్కూల్ నే ఎంచుకుంటారేమో చూద్దాం.

Tags:    

Similar News