సామ్ మిలియన్ డాలర్ లోకి ఎంటర్ అయింది

అక్కినేని సమంత నటించిన లేటెస్ట్ మూవీ ఓ బేబీ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 11 కోట్లకు పైగా సాధించింది. 17 రోజులు పూర్తి చేసుకుని దాదాపు [more]

Update: 2019-07-24 07:21 GMT

అక్కినేని సమంత నటించిన లేటెస్ట్ మూవీ ఓ బేబీ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 11 కోట్లకు పైగా సాధించింది. 17 రోజులు పూర్తి చేసుకుని దాదాపు గా 17 కోట్ల రూపాయలని రాబట్టింది ఈమూవీ. ముఖ్యంగా ఈసినిమాను తన భుజాలపై వేసుకుని సామ్ ప్రమోట్ చేయడం ఇంతలా కలెక్షన్స్ రావడం జరిగాయి. తెలుగు రాష్ట్రాలు పక్కన పెడితే ఓవర్సీస్ లో కూడా ఈసినిమా మంచి వసూళ్లు సంపాదిస్తుంది.

ఓవర్సీస్ లో మన స్టార్ అండ్ మీడియం రేంజ్ హీరోస్ కి మిలియన్ డాలర్ అనేది సాధారణ విషయంగా మారింది. కానీ హీరోయిన్స్ కి మాత్రం ఈ ఫీట్ ని అందుకోవడం చాలా కష్టం. కానీ సామ్ ఓ బేబీ తో లేటెస్ట్ గా మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. మొదటి షో నుండే హిట్ టాక్ తో వసూళ్లు దక్కించుకున్న సామ్ కి పెద్ద విషయమే అని చెప్పాలి. ఈ సినిమాకు మిలియన్ డాలర్ వసూళ్లు రావడంతో ప్రస్తుతం యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రన్ పూర్తి అయినట్టే అంటున్నారు ట్రేడ్. ఎందుకంటే ఈ వారం డియర్ కామ్రేడ్ భారీగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఓ బేబీ ని ఎవరు పటించుకోరు అంటున్నారు ట్రేడ్.

ఫుల్ జోష్ తో సామ్ తన నెక్స్ట్ మూవీ 96 రీమేక్ పై ఫోకస్ పెట్టింది. పెళ్లి తరువాత వరస విజయాలతో మంచి ఫామ్ లో ఉంది అక్కినేని సమంత.

Tags:    

Similar News