‘మిస్ గ్రానీ’ కాదు ‘ఓ బేబీ’..!

అక్కినేని సమంత పెళ్లి తరువాత వరుస విజయాలతో దూసుకుపోతున్న టైంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. అది కూడా ఒక కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేయడం విశేషం. [more]

Update: 2019-05-22 08:54 GMT

అక్కినేని సమంత పెళ్లి తరువాత వరుస విజయాలతో దూసుకుపోతున్న టైంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. అది కూడా ఒక కొరియన్ చిత్రాన్ని రీమేక్ చేయడం విశేషం. ఇందులో సామ్ విభిన్నమైన, విలక్షణమైన పాత్ర చేస్తుంది. ఈ మూవీని లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం చేస్తున్నారు. ‘ఓ బేబీ’ అనే పేరుతో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. సామ్ లుక్ నార్మల్ గానే ఉన్నప్పటికీ ఆమె చుట్టూనే కథ మొత్తం తిరుగుతుందట. అయితే ఇందులో ఒక కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ లక్ష్మీ కనిపించనున్నారు.

కొత్త కథాకథనంతో…

మరో ముఖ్య పాత్రలో ఊర్వశీ, రాజేంద్ర ప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య నటిస్తున్నారు. నిజానికి ఈ మూవీకి ముందు నుండీ ఒరిజినల్ టైటిల్ ‘మిస్ గ్రానీ’ అనే పెడదాం అనుకున్నారు. కానీ చివరికి ‘ఓ బేబీ’ ఫిక్స్ అయ్యారు. సగభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. కొత్తదనంతో కూడిన కథాకథనాలతో ఈ సినిమా సాగుతుంది అని తెలిసింది. ఇక ఈ మూవీని సురేష్ బాబుతో పాటు సునీత తాటి, విశ్వా ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

Tags:    

Similar News