అక్కినేని కోడలంటే మజాకా అనుకున్నారా?

అక్కినేని కోడలు, చైతు భార్య టాప్ హీరోయిన్ సమంత ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు.. సోషల్ ఇండియాలో హాట్ టాపిక్ గా మరింది. లాక్ డౌన్ లో [more]

Update: 2020-08-26 04:38 GMT

అక్కినేని కోడలు, చైతు భార్య టాప్ హీరోయిన్ సమంత ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు.. సోషల్ ఇండియాలో హాట్ టాపిక్ గా మరింది. లాక్ డౌన్ లో అందరూ జిమ్ లు, కొత్తరకాల వంటలతో సరిపెడితే సమంత మాత్రం ఆరోగ్యానికి అవసరమైన పోషకాహారాన్ని స్వయంగా తన మిద్దె మీదనే పండించి అందరిని ఆశ్చర్యపరిచింది. మిద్దె వ్యవాయంపై సమంత పెద్ద రిచేర్చి చెయ్యడం దానిలో ఫుల్ గా సక్సెస్ అవడం సమంత సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోస్ తో అందరికి తెలిసింది. సమంత మిద్దె వ్యవసాయం అందరికి ఆదర్శం మాత్రమే కాదు., ఇప్పుడు సమంత చాలామందికి సవాల్ విసిరింది. మన ఆరోగ్యానికి అవసరమైన ఆహారం మనమే పండిద్దాం అంటూ నడుం కట్టింది. సమంత ఆకూ కూరలు, కూరగాయలు ఇలా చాలా రకాల పంటలు పండించింది. తాజాగా సమంత కారెట్స్ పండించి ఆ మొక్కలతో సోషల్ మీడియాలో ఓ ఫోటోకి ఫోజిచ్చింది.

కేవలం ఫోటోకి ఫోజులివ్వడమే కాదు.. సమంత.. ఈ వారం తన మెనులో డైట్ గురించి కూడా చెప్పేసింది. తాను పండించిన ఆ కేరెట్స్ ని చూపిస్తూ.. ఈ వారం నా మెనులో కేరెట్ జ్యుస్, కేరెట్ హాల్వా, కేరెక్టర్ పచ్చడి, కేరెట్ పకోడీ, కేరెట్ ఫ్రై, కేరెట్ ఇడ్లి, కేరెట్ సమోసా, కేరెట్ కేక్ అంటూ కేరెట్ తో తన వారం మెనూని నింపేసింది. మరి కేరెట్స్ ని పండించడమే కాదు.. వాటిని ఎలా తింటుందో కూడా సమంత  అందరికి చెబుతుంది. మరి సమంత షేర్ చేసిన ఫోటో చూసిన సెలబ్రిటీస్ నమ్రత శిరోద్కర్, వెన్నెల కిషోర్, అనుపమ పరమేశ్వరన్, అనసూయ, చిన్మయి లాంటి వారు సమంత ఫోటో కి లైక్స్ కొట్టడమే కాదు.. వావ్, సూపర్బ్ అంటూ కామెంట్స్ కూడా పెట్టారు. ఇక సమంత షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.

Tags:    

Similar News