నందినితో మరోసారి సై అంటున్న సామ్

అక్కినేని సమంత – నందిని రెడ్డి లు మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిన విషయమే. వీరి కాంబినేషన్ గతంలో `జ‌బ‌ర్‌ద‌స్త్‌` అనే సినిమా వచ్చింది. అది [more]

Update: 2019-07-10 06:17 GMT

అక్కినేని సమంత – నందిని రెడ్డి లు మంచి ఫ్రెండ్స్ అని అందరికి తెలిసిన విషయమే. వీరి కాంబినేషన్ గతంలో 'జ‌బ‌ర్‌ద‌స్త్‌' అనే సినిమా వచ్చింది. అది డిజాస్టర్ అవ్వడంతో మళ్లీ వీరి కాంబినేషన్ సినిమా రాలేదు. డైరెక్టర్ నందిని రెడ్డి 'క‌ల్యాణ వైభోగ‌మే'తో తిరిగి ఫామ్ లో రావడంతో ఆమెకు 'మిస్ గ్రానీ'ని రీమేక్ చేసే బాధ్య‌త ఇచ్చింది సామ్.

ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దాంతో ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. అయితే మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశముందని చెబుతున్నారు. వీరిద్ద‌రి కాంబోలో హ్యాట్రిక్ సినిమా రాబోతోంద‌ని టాక్‌. ఓ బేబీ చిత్ర షూటింగ్ అప్పుడే సామ్..ఈ సినిమా హిట్ అయితే మనం మరోసారి కలిసి పనిచేద్దాం అని చెప్పిందట.

అయితే సామ్ – నందిని కాంబినేషన్ లో రావాల్సిన చిత్రం కథ కూడా రెడీ అయిపోయిందట. అదొక థ్రిల్ల‌ర్ చిత్ర‌మ‌ని, ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లోనే చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. సామ్ ఎప్పటినుండో నిర్మాణ రంగంలో కి అడుగు పెట్టాలని చూస్తుంది. అన్ని కుదిరితే ఈసినిమాతో ఆమె నిర్మాతగా మారే అవకాశముందని సమాచారం.

Tags:    

Similar News