రానా వలన ఫీలయిన సమంత!!

అల్లు అరవింద్ తన ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా కోసం సమంత తో సామ్ జామ్ టాక్ షో ని భారీగా డిజైన్ చేసాడు. సమంత క్రేజ్, [more]

Update: 2020-11-24 07:22 GMT

అల్లు అరవింద్ తన ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా కోసం సమంత తో సామ్ జామ్ టాక్ షో ని భారీగా డిజైన్ చేసాడు. సమంత క్రేజ్, ఆమె ఉత్సాహం అన్ని ఆహా సామ్ జామ్ షో కి హెల్ప్ అవడం పక్కా. ఈ షో కి టాప్ సెలబ్రిటీస్ ని తెచ్చి వాళళ్ వ్యక్తిగత విషయాలతో పాటుగా సినిమాకి సంబందించిన, సమాజానికి సంబందించితిన్ ప్రశ్నలతో సమంత వాళ్లతో ఆడుకుంటుంది. అందులో భాగముగా విజయ్ దేవరకొండ మొదటగా ఈ షోకి హాజరవగా, సెకండ్ ఎపిసోడ్ కి చిరు వచ్చాడని పిక్స్ వచ్చినా రానా ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.

సమంత సామ్ జామ్ షో కోసం రానా – నాగ్ అశ్విన్ కలిసి సామ్ జామ్ సెకండ్ ఎపిసోడ్ పూర్తయ్యింది. అయితే ఈ షో లో రానా తన వ్యక్తిగత విషయాలను సమంత సామ్ జామ్ షోలో పంచుకున్నాడు. రానా తన ఆరోగ్యం పై చాలా రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సామ్ జామ్ షో తో చెక్ పెట్టాడు. రానా పుట్టినప్పటినుండి బిపి ఉందట. దాని వలన రానాకీ హార్ట్ ప్రాబ్లమ్ కూడా వస్తుంది అని.. ఆ సమస్యల వలన కిడ్నీస్ పాడవుతాయని డాక్టర్స్ చెప్పినట్టుగా రానా ఈ షోలో చెప్పాడు. అంతేకాకుండా మెదడులో నరాలు చిట్లిపోయి స్ట్రోక్ అవడానికి 70 శాతం అవకాశం ఉందని.. చనిపోవడానికి 30 శాతం అవకాశం ఉందని డాక్టర్స్ చెప్పినట్టుగా రానా కన్నీరు పెట్టుకున్నాడు. దానితో అక్కడే ఉన్న సమంత చాలా ఫీలైంది. రానా కన్నీరు, సమంత ఫీలింగ్స్ అన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Tags:    

Similar News