నాకెవడో ఇల్లు కొనిస్తే.. నేను పనిచెయ్యడమెందుకు!

రకుల్ అంటే కేరాఫ్ హాట్ న్యూస్ గా మారిపోయింది. డ్రగ్స్ కేసుతో పాటుగా తెలుగు సినిమా అవకాశాలు తగ్గడంతో రకుల్ ని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నాడు. కానీ [more]

Update: 2020-12-16 16:57 GMT

రకుల్ అంటే కేరాఫ్ హాట్ న్యూస్ గా మారిపోయింది. డ్రగ్స్ కేసుతో పాటుగా తెలుగు సినిమా అవకాశాలు తగ్గడంతో రకుల్ ని సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నాడు. కానీ తన మీద వచ్చే న్యూస్ ల విషయంలో రకుల్ తట్టుకోలేకపోయింది. అందుకే రకుల్ మీడియా టార్చెర్ తట్టుకోలేక కోర్టుకెక్కింది.. కోర్టు మీడియాకి అక్షింతలు వేసింది. ఆఖరుకి రకుల్ మీడియాతో క్షమాపణలు కూడా చెప్పించుకుంది. అదంతా పక్కనబెడితే తాజాగా రకుల్ ప్రీత్ సామ్ జామ్ షోకి గెస్ట్ గా వచ్చింది. ఆ షో లో సమంత అడిగే ప్రశ్నలకు రకుల్ రెచ్చిపోయి సమాధానాలు చెప్పింది. నువ్వు ఎవరినైనా బైక్ మీద ఎక్కించుకుంటే ఛార్జ్ చేసేదాన్నివట అని రకుల్ ని సమంత అడగగానే అవును మీకెలా తెలుసు అనేసింది. మాకన్ని తెలుసు అని సమంత కామెడీ చేసింది.

దర్శకుడు క్రిష్ తో కలిసి సామ్ జామ్ షో కి వచ్చిన రకుల్ ని సమంత ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగింది. నీ మీద రూమర్స్ ఎక్కువగా వస్తుంటాయి కదా.. నువ్వెందుకు స్పందించవు.. నేనైతే వెంటనే స్పందిస్తా అని సమంత రకుల్ నిఅడగ్గానే.. అమ్మో నా మీద వచ్చే రూమర్స్ మాములుగా ఉండవు. అందుకే పట్టించుకోవడం మానేసాను. మనపై పుకార్లు పుట్టించేవారు మన గురించి అస్సలు ఆలోచించరు. నాకు హైదరాబాద్ లో ఒకరు ఇల్లు గిఫ్ట్ గా కొనిస్తే నేను దాంట్లో ఉంటున్నా అని ప్రచారం చేస్తున్నారు. మరి వాళ్లెవరో ఇల్లు కొంటె నేనెందుకు పని చెయ్యడం.. ఇలాంటి పుకార్లు నా మీద చాలానే వచ్చాయి అంటూ స్మూత్ గా సమాధానాలు చెప్పింది.

Tags:    

Similar News