సలార్ విలన్ అతనేనా?

ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో నటించబోయే నటుల మీద ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిమ్స్ లో నటించబోయే హీరోయిన్స్ కుదిరారు. [more]

Update: 2021-02-08 04:59 GMT

ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల్లో నటించబోయే నటుల మీద ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిమ్స్ లో నటించబోయే హీరోయిన్స్ కుదిరారు. ఒక్క ఆదిపురుష్ కి తప్ప. క్రాక్ తో హిట్ కొట్టిన శృతి హాసన్ ప్రభాస్ సలార్ లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ప్రభాస్ సలార్ షూటింగ్ లో పాల్గొంటుంది. మరోపక్క నాగ్ అశ్విన్ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ని హీరోయిన్ గా సెలెక్ట్ చెయ్యడమే కాదు.. మరో కీ రోల్ కి అమితాబచ్చన్ ని కూడా ఎంపిక చేసుకున్నాడు. ఇక ఆదిపురుష్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని ఫిక్స్ చేసిన ఓం రౌత్ ఇంకా ప్రభాస్ కోసం సీతని ఫిక్స్ చెయ్యలేదు.


ఇక ఇప్పుడు సలార్ సినిమాలో ప్రభాస్ తో తలపడబోయే విలన్ ఎవరో తెలిసిపోయింది. స్వయంగా సలార్ లో నటిస్తున్నా అంటూ సోషల్ మీడియా ద్వారా.. ప్రశాంత్ నీల్ సలార్ నటిస్తున్నందుకు హ్యాపీ.. ఆ సినిమాలో అవకాశం రావడం గర్వంగా ఉంది. సలార్ లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఈ గోల్డెన్ ఆపర్చ్యునిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్, నిర్మాతలకు కృతజ్ఞతలని, ఈ విషయాన్నీ అభిమానులతో పంచుకోవాలని షేర్ చేస్తున్నా అంటూ కన్నడ నటుడు మధూ గురుస్వామి ట్వీట్ చేసాడు. ఇంతకుముందు సలార్ విలన్ గా విజయ్ సేతుపతి పేరు తెరమీదకి వచ్చినా.. విజయ్ సేతుపతి నేను సలార్ లో నటించడం లేదంటూ క్లారిటీ ఇవ్వడంతో సలార్ విలన్ పై అందరిలో క్రేజ్ మరియు ఆసక్తి పెరింది. మరి ఈ సలార్ లో ప్రభాస్ తో ఢీ కొట్టబోయేది మధూ గురుస్వామి అంటూ ప్రభాస్ ఫాన్స్ అయితే ఫిక్స్ అవుతున్నారు. .

Tags:    

Similar News