అది అయ్యాక సాయి సినిమా అదేనా?

సాయి తేజ చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాల తర్వాత సోలో బ్రతుకే సో బెటరు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఈపాటికి కంప్లీట్ అవ్వాల్సింది. కానీ [more]

Update: 2020-07-18 06:12 GMT

సాయి తేజ చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాల తర్వాత సోలో బ్రతుకే సో బెటరు సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఈపాటికి కంప్లీట్ అవ్వాల్సింది. కానీ కరోనా అడ్డం పడింది. అయితే సోలో బ్రతుకే సో బెటరు తర్వాత సాయి తేజ్ దేవా కట్ట దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. అయితే ఈ సినిమా తర్వాత సాయి తేజ్ ఇప్పుడు మరో సినిమాకి కమిట్ అయ్యాడని… లాక్ డౌన్ సమయంలో సాయి తేజ్ కొత్త దర్శకుడు గోపాల కృష్ణ చెప్పిన కథని విని మామ చిరు వద్దకి తీసుకెళ్లి మరీ ఒకే చేయించుకున్నట్టుగా సోషల్ మీడియా టాక్. చిత్రలహరి సినిమా అప్పటినుండి సాయి తేజ్ కథలను ఫైనల్ గా చిరు కూడా ఓకె చేస్తున్నాడట.

అయితే గోపాల కృష్ణ చెప్పిన కథని మామ దగ్గర ఓకె చేయించుకుని ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట సాయి తేజ్. దానితో కొత్త దర్శకుడు గోపాల కృష్ణ ప్రీ ప్రొడక్షన్ పనులని మొదలుపెట్టాడట. అయితే సాయి తేజ్ కన్నా ముందు గోపాల కృష్ణ ఈ కథతో రవితేజని కలవడం.. రవితేజ గోపాల కృష్ణ చెప్పిన కథకి ఇంప్రెస్స్ అయినా… ప్రస్తుతం తానున్న బిజీలో ఇప్పుడే సినిమా చేయలేనని.. అయితే నా ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక ఈ సినిమా చేద్దామని గోపాలకృష్ణని హోల్డ్ లో పెట్టగా గోపాల కృష్ణ మెగా హీరో సాయి తేజ్ తో తన కథకి ఓకె చెప్పించుకున్నాడని అంటున్నారు. అయితే చిరు ఈ కథలో కొన్ని మార్పులు చేపించాకే ఓకె చేసాడని. దానితో గోపాలకృష్ణ ధైర్యంగా సినిమాకి ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టాడని అంటున్నారు.

Tags:    

Similar News